ఆకాశంలో వింతలు.. విశేషాలకు కొదవ ఉండదు. విశ్వం వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఎన్నో దశాబ్దాలుగా ఇవి సాగుతూనే ఉన్నాయి. ఎన్నో కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మరో వింత వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. అమెరికాలోని ఓ ప్రయోగశాల నిరంతరం ఆకాశంలో చోటుచేసుకునే వాటిని ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు.
అయితే అలా తీసిన వీడియో, ఫొటోలో ఒకచోట 9 వింత నక్షత్రాలు కనిపించాయి. అరగంట తర్వాత అవి మాయం అయ్యాయి. ఈ చిత్రాలు తీసింది 12 ఏప్రిల్ 1950 లో.. కానీ వాటిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు ఇప్పుడు ఈ విషయంపై ఆసక్తి కలిగింది. ప్రస్తుతం భారత్ సహా మరికొన్ని దేశాలు వీటిపై పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనల ప్రారంభ అధ్యయనాన్ని ఇటీవల ప్రచురించారు. ఈ ప్రచురణల్లో బలంగా చెప్పిన అంశం ఆసక్తి కలిగించేదిగా ఉంది. గ్రహాంతర వాసుల గురించి ఇప్పుడు చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ పరిశోధనల ప్రచురణ ప్రాముఖ్యత సంతరించుకుంది. భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలు ఆకాశంలో మరో ప్రపంచం ఉందని అంగీకరించాయి. ఆకాశంలో కనిపించే విషయాలను పరిశోధించడానికి, సౌర ప్రతిబింబాల యొక్క డిజిటలైజ్డ్ డేటాను చూడాలి. ప్రపంచంలోని బలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చూసిన తరువాత ఆ 9 నక్షత్రాలు మళ్లీ కనిపించలేదు. సిసిడి డిటెక్టర్ సర్వేలో కూడా ఈ నక్షత్రాలు కనిపించలేదు.
ఇలా ఏ టెలిస్కోప్ ద్వారా చూసినా కనిపించకపోవడంతో దీని వెనుక రేడియోధార్మిక కణాలు ఉండవచ్చని ఒక వర్గం చెబుతోంది. మరికొంత మంది ఈ 9 నక్షత్రాలు గహంతరవాసులు వాడుకునే ఓడ అని చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పటివరకు ఆ 9 నక్షత్రాలు ఏంటనే దానిపై క్లారిటీ మాత్రం రాలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…