Anchor Lasya: తండ్రి కళ్లల్లో ఆనందం కోసం ఏమైనా చేస్తా..! దాని కోసమే ఇంటిని నిర్మిస్తున్నాం..!
Anchor Lasya: యాంకర్ లాస్య, యాంకర్ రవి జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు గత 5 సంవత్సరాల క్రితం వీళ్ల యాంకరింగ్ చేసిన ప్రతీ షో టీఆర్పీ రేటింగ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోయేది. వీళ్లిద్దరు కలసి చేస్తే చాలు ఇక.. ప్రశాతంగా ఉండొచ్చు అని షో నిర్వాహకులు ఆలోచించేవాళ్లు.
మధ్యలో ఏమైందో ఏమో గానీ.. యాంకర్ రవి కంటిన్యూ అయినా.. లాస్య మాత్రం 4 ఏళ్ల పాటు బుల్లితెరకు దూరంగా ఉన్నారు. ఎలాంటి షోలు చేయకుండా.. సోషల్ మీడియాలో కూడా కనపడకుండా.. అస్సలు ఆమె జాడ కూడా తెలియదు అన్నట్లుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఆ నాలుగేళ్లతో ఎన్నో రూమర్స్ వచ్చాయి.
తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో అవకాశం వచ్చిన తర్వాత ఆమె మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. బిగ్ బాస్ లో తనదైన శైలిలో సందడి చేస్తూ..తన అభిమానులను మళ్లీ అలరించారు. బయటకు వచ్చిన తర్వాత ఇక టీవీ షోలో మెరుస్తూ సోషల్ మీడియా అకౌంట్లలో తన ఫాలోవర్స్ ను ఇంకా పెంచుకున్నారు.
అయితే రవితో ఆ జోడీ కొనసాగిద్దామని ఇద్దరూ ప్రయత్నించారు. ఒకటి రెండు షోల్లో యాంకరింగ్ గా జోడీ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఇక ఆమెకు పెళ్లి కావడం.. లాస్యకు ఒక కొడుకు కూడా ఉన్నాడని బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాతనే ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి అంటే ఆమెకు ఎంతో ఇష్టమని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ప్రోగ్రామ్ లో ఆమె మాట్లాడుతూ.. మా పాత ఇల్లు కూల్చేశాం. ఆ స్థానంలో తాము కొత్త ఇంటిని నిర్మిస్తున్నాం అంటూ చెప్పారు. ఆ ఇల్లు కేవలం తన ఫాదర్ కు గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పారు. దానకి సంబంధించి ఓ వీడియోను తన యూట్యూబ్ లో పోస్టు కూడా చేశారు. నాన్న కళ్లలో ఆనందం చూడటానికి నేనేదైనా చేస్తాను. ఆయన సంతోషం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఆయన కోసం ఇష్టంతో ఇల్లు కట్టిస్తున్నానంటూ ఆ వీడియోలో గదులన్నింటినీ చూపించింది. ఇల్లు దాదాపు పూర్తయిందని.. గృహప్రవేశం రోజున అన్నింటినీ చూపిస్తాను అంటూ చెప్పారు. అంతే కాదు అంతక ముందు ఆమె తన తండ్రికి ఓ ట్రాక్టర్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. దీనిలో కూర్చొని సందడి చేస్తున్నట్లు ఆ వీడియోలో చూపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…