Health News

మగవారు ఫోన్ ఎక్కువ మాట్లాడితే… ఆ సంఖ్య తగ్గిపోతుందట!

ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో మనకు సెల్ ఫోన్ దర్శనమిస్తుంది. ఒక్క నిమిషం చేతిలో సెల్ లేకపోతే పాలు పోదు. ఉదయం నిద్ర లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు సెల్ మన చేతిలో దర్శనమిస్తుంది.ఈ విధంగా గంటల తరబడి సెల్ ఫోన్ కి పరిమితం కావడం వల్ల అనేక సమస్యలు వస్తాయని మనకు తెలిసినప్పటికీ కూడా సెల్ వినియోగించడం తగ్గడం లేదు.

ముఖ్యంగా మగవారు సెల్ ఫోన్ అధికంగా వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయని తాజా అధ్యయనాల్లో నిరూపించబడింది.సెల్ ఫోన్ వాడటం వల్ల ప్రతి ఒక్కరి లో సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్య మగవారిలో అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం ఫోను ఉపయోగిస్తున్నప్పుడు సెల్ ఫోన్ నుంచి బ్లూ లైట్ వెలువడుతుంది. ఈ లైట్ వల్ల సమస్యలు ఎదురవుతాయి.

సెల్ ఫోన్ నుంచి విడుదలయ్యే ఈ కాంతి మన కళ్ళలో పడినప్పుడు మన కంటికి మాత్రమే కాకుండా మగవారిలో, స్పెర్మ్ కౌంట్ తగ్గించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసమే మగవారు వీలైనంతవరకు సెల్ ఫోన్ కి వాడకాన్ని తగ్గించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో 23 శాతం మగవారు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో సతమత మవుతున్నారు.మొత్తం జనాభాలో 15 నుంచి 20 ఈ సమస్యతో బాధ పడుతుండగా అందులో 20 నుంచి 40 శాతం మగవారు ఉన్నారు. కనుక భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

22 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

24 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago