Surya: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి నుంచి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించారు.
ఇక ఈ సినిమా తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ భాషలలో విడుదలయ్యే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గత నాలుగు సంవత్సరాల నుంచి కమలహాసన్ వెండితెరకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే విక్రమ్ సినిమా ద్వారా ఆ లోటును భర్తీ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా సుమారు 120 కోట్ల బడ్జెట్ తో కమల్ హాసన్ నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో మరొక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్లైమాక్స్ సన్నివేశంలో ఐదు నిమిషాల పాటు ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ ఐదు నిమిషాలు సూర్య నటన అద్భుతమనే చెప్పాలి. ఈ పాత్రలో సూర్య నటించిన అందుకు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇకపోతే ఈ సన్నివేశంలో నటించేందుకు సూర్య ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారని సమాచారం. సూర్య ఎప్పటికైనా కమల్ హాసన్ తో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది తన కలని తన కల విక్రమ్ సినిమా ద్వారా నెరవేరింది అంటూ కమల్ హాసన్ కి సూర్య ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.విక్రమ్ సినిమాతో తన కల నెరవేరడంతో ఈ సినిమాలో నటించినందుకు సూర్య ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…