రొయ్యలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు తింటారు. దాదాపు అందరూ దీనిని ఇష్టపడే వాళ్లే. కాకపోతే వాళ్లకు సముద్రం, నదులు దగ్గరగా ఉండటంతో అవి అందుబాటులో దొరుకుతాయి. అయితే కొంతమంది వీటిని తినడానికి ఇష్టపడరు.
కానీ వీటి వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు. వాటి గురించి తెలుసుకుందాం.. అయితే ఈ రొయ్యల్లో ఎక్కువగా నాణ్యమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. తరచూ డైట్లో రొయ్యలకు చోటిస్తే.. కావాల్సినతం బలం వస్తుంది. అతి తక్కువ ఫ్యాట్ ఉండే మాంసాహారం కేవలం రొయ్యలు మాత్రమే. వీటితో రకరకాల కూరలు వండుకోవచ్చు. ఏది వండినా రుచికరంగానే ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మెదడు, నరాల సంబంధిత జబ్బులు కూడా వచ్చే అవకాశం తక్కువ.
రక్త ప్రసరణ సక్రమంగా జరిగేట్లు సహాపపడతాయి. రొయ్యల్ని తినటం వల్ల థైరాయిడ్ సమస్యలు తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా దీనిలో క్యాన్సర్ రాకుండా సెలీనియం అనే పదార్థం ఉంటుందట. ఇది శరీరంలో క్యాన్సర్ సెల్ ను పెరగనీయకుండా నియంత్రిస్తుంది. ఇక దంతాలు, ఎముకలకు గట్టి దనాన్ని ఇస్తుంది. చర్మం ఎంతో మృదువుగా తయారవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రక్త హీనత ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే.. ఆ వ్యాధి నుంచి బయటపడొచ్చు. కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా అనేక రకాల వ్యాధులు దరి చేరకుండా.. ఒక వేళ వ్యాధి వచ్చినా.. దీని ద్వారా నియంత్రణ చేసుకోవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…