Health Benefits: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..! అయితే మీ శరీరంలో నీరు లేనట్లే..?
Health Benefits: మన శరీరం కోట్లాది అణువులతో ఏర్పడింది. శరీరంలో జీవక్రియలు జరగాలంటే… మనిషికి నీరు చాలా ముఖ్యం. ఆహారం లేకపోయినా కొన్ని వారాల పాటు బతికే అవకాశం ఉంటుంది. కానీ నీరు లేకపోతే కేవలం కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతారు.
అంతలా శరీరానికి నీరు అవసరం. మానవశరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది. నీరు లేకపోతే శరీరంలోని జీవక్రియలు సరిగా పనిచేయలేవు. ఏ కాలం అయినా నీటిని తప్పకుండా సరిపడేంతగా నీటిని తీసుకోవాలి. ఇలా చేయని పక్షంలో చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే..అన్ని అవయవాలు వాటి పనితీరును సక్రమంగా నిర్వహించాలంటే నీరు చాలా అవసరం. ఎండాకాలం, చలికాలం ఏ కాలం అయినా శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవాలి. శరీరంలో తగినంతగా నీరు లేకపోతే మూత్రపిండాలు, జీర్ణక్రియ, మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
శరీరానికి తగినంత నీరు అందకపోతే.. మూత్రం పసుపు రంగులో మారతుంది. దీని ద్వారా మన శరీరానికి నీరు అవసరమని గుర్తించవచ్చు. ఒక వ్యక్తి తక్కువ మొత్తంలో నీటిని తీసుకుంటే.. జీర్ణశక్తి బలహీన పడటంతో పాటు కడుపులో నొప్పి, మంట ప్రారంభం అవుతుంది. తగినంత నీరు లేకపోతే మనం తిన్న ఆహారం కూడా జీర్ణం కాదు. నీరు తగినంత తీసుకోకపోతే.. శరీరం పొడిబారుతుంది. ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. శరీరంలో నీటి కొరత ఉంటే కీళ్ల నొప్పులు, తలనొప్పి వస్తాయి. నీరు తక్కువగా తీసుకోవడం వల్ల పెదాలు కూడా పొడి బారుతాయి. ఎవరికైనా పెదవులు పగిలడం ప్రారంభిస్తే.. శరీరంలో తగినంత నీరు శరీరంలో లేదని అర్థం చేసుకోవచ్చు. వర్క్ అవుట్స్ చేసే వారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. సాధారణంగా ఓ వ్యక్తి రోజుకు 12-14 గ్లాసుల నీరు త్రాగాలి. దీంతో పాటు శరీరంలో నీటి శాతం కూడా ఎక్కువ కాకుండా కూడా జాగ్రత్త పడాలి. ఎక్కువ నీరు కూడా శరీరానికి హాని కలిగిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…