ఉప్పును ఎక్కువగా తినకూడదని అందరికీ తెలిసిందే. దీని వల్ల ఎక్కువగా అనారోగ్యాల బారిన పడతారు. అసలు వీటి వల్ల వచ్చే రోగాలు ఏంటో తెలుసుకుందాం.. కూరల్లో తగినంత ఉప్పు వేసుకొని తింటే.. ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. కానీ అది మోతాదు కంటే మించితే మాత్రం ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులతో పాటు.. మూత్రపిండాల వ్యాధుల వరకు వ్యాధులు సోకుతాయి.
అయితే రోజుకు ఉప్పును 5 గ్రాముల కంటే ఎక్కువగా తినకూడదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పరిమాణం పెరిగి రక్త పోటు ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఉప్పులో ఉండే సోడియం శరీరానికి చాలా అవసరం కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే రాత్రి పూట అస్సలు నిద్ర పట్టదు కాబట్టి ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి. మూత్ర సమస్యలు రావడానికి కారణం కూడా ఉప్పును ఎక్కువగా తీసుకోవడమే. ఈ సమస్య ఎక్కువగా మహిళలు.. వయసు పై బడిన వారి లో ఉంటుంది.
అలానే ఉప్పు తీసుకోవడం వల్ల సోడియం రక్తంలో కలిసి నీటి ఉత్పత్తి పెరిగి పోతుంది. దీని ఫలితంగా రక్తం పరిమాణం పెరిగే దీనితో మూత్రం ఎక్కువగా వస్తుంది. కాబట్టి అధిక మోతాదులో దీనిని తీసుకోవడం మంచిది కాదు. రోజుకి ఐదు గ్రాముల కంటే ఉప్పు తీసుకోకూడదు. కానీ మన భారత దేశంలో రోజుకు 11 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నట్లు సమాచారం. మూత్రపిండాలపై అధిక భారం పడితే అది గుండెపై కూడా ప్రభావం చూపతిస్తుంది.
అధిక సోడియంను కరిగించడానికి మూత్ర పిండాలు మూత్ర విసర్జన సమస్య, రక్తంలో అధిక సోడియం వల్ల ధమనుల ఒత్తిడిని పెరుగుతుంది. ఇలా ధమనులు గట్టి పడడానికి దారి తీస్తుంది అలానే హృదయ సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, మూత్ర పిండాల వ్యాధులు వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఉప్పును సాధ్యమైనంత తగ్గించి తినడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…