ఉప్పును ఎక్కువగా తినకూడదని అందరికీ తెలిసిందే. దీని వల్ల ఎక్కువగా అనారోగ్యాల బారిన పడతారు. అసలు వీటి వల్ల వచ్చే రోగాలు ఏంటో తెలుసుకుందాం.. కూరల్లో తగినంత ఉప్పు వేసుకొని తింటే.. ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. కానీ అది మోతాదు కంటే మించితే మాత్రం ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులతో పాటు.. మూత్రపిండాల వ్యాధుల వరకు వ్యాధులు సోకుతాయి.
అయితే రోజుకు ఉప్పును 5 గ్రాముల కంటే ఎక్కువగా తినకూడదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పరిమాణం పెరిగి రక్త పోటు ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఉప్పులో ఉండే సోడియం శరీరానికి చాలా అవసరం కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే రాత్రి పూట అస్సలు నిద్ర పట్టదు కాబట్టి ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి. మూత్ర సమస్యలు రావడానికి కారణం కూడా ఉప్పును ఎక్కువగా తీసుకోవడమే. ఈ సమస్య ఎక్కువగా మహిళలు.. వయసు పై బడిన వారి లో ఉంటుంది.
అలానే ఉప్పు తీసుకోవడం వల్ల సోడియం రక్తంలో కలిసి నీటి ఉత్పత్తి పెరిగి పోతుంది. దీని ఫలితంగా రక్తం పరిమాణం పెరిగే దీనితో మూత్రం ఎక్కువగా వస్తుంది. కాబట్టి అధిక మోతాదులో దీనిని తీసుకోవడం మంచిది కాదు. రోజుకి ఐదు గ్రాముల కంటే ఉప్పు తీసుకోకూడదు. కానీ మన భారత దేశంలో రోజుకు 11 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నట్లు సమాచారం. మూత్రపిండాలపై అధిక భారం పడితే అది గుండెపై కూడా ప్రభావం చూపతిస్తుంది.
అధిక సోడియంను కరిగించడానికి మూత్ర పిండాలు మూత్ర విసర్జన సమస్య, రక్తంలో అధిక సోడియం వల్ల ధమనుల ఒత్తిడిని పెరుగుతుంది. ఇలా ధమనులు గట్టి పడడానికి దారి తీస్తుంది అలానే హృదయ సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, మూత్ర పిండాల వ్యాధులు వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఉప్పును సాధ్యమైనంత తగ్గించి తినడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…