తూర్పుగోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా ఒక వింత జీవి పర్యటిస్తూ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అంతేకాకుండా వింత జీవి స్థానికుల కంటపడకుండా ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో పశువులను చంపేస్తుంది. ఆ జంతువు ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుందో అనే భయంతో ఆ రెండు మండలాలలోని ప్రజలు నిత్యం భయపడుతూ ఇంటికి మాత్రమే పరిమితమై ఉన్నారు. ఈ విషయంపై ఎంతో ఆందోళన చెందిన రైతులు పశువులను చంపిన వింతజీవిని ఎట్టకేలకు గుర్తించారు.ఆలమూరు మండలం పెనికేరులోని బావిలో ఆ జంతువు ఉన్నట్లు ఈరోజు తెల్లవారుజామున ఆ వింత జీవిని రైతుల గుర్తించారు.
వింత జంతువును గుర్తించిన రైతులు దాని దగ్గరకు వెళ్లడానికి బయపడుతున్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడిన ఆ జంతువు బయట ఉన్న జనాలను చూసి భయంతో బయటకి, లోపలికి వెళ్తుందని ఆ ప్రాంతంలోని రైతులు చెబుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ విషయం గురించి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు,అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వింతజీవి ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ జంతువు ఏమిటి? ఏ జాతికి చెందినది అనే విషయాలు తెలియాలంటే ఆ జంతువును బావి నుంచి బయటకు తీస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి, ప్రజలను భయపెడుతున్న ఆ జంతువు ఏమిటనే విషయం తెలియదని అధికారులు తెలిపారు.బావి నుంచి ఆ జంతువును బయటకు తీయడానికి అధికారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఎంతో శ్రమిస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…