తూర్పుగోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా ఒక వింత జీవి పర్యటిస్తూ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అంతేకాకుండా వింత జీవి స్థానికుల కంటపడకుండా ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో పశువులను చంపేస్తుంది. ఆ జంతువు ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుందో అనే భయంతో ఆ రెండు మండలాలలోని ప్రజలు నిత్యం భయపడుతూ ఇంటికి మాత్రమే పరిమితమై ఉన్నారు. ఈ విషయంపై ఎంతో ఆందోళన చెందిన రైతులు పశువులను చంపిన వింతజీవిని ఎట్టకేలకు గుర్తించారు.ఆలమూరు మండలం పెనికేరులోని బావిలో ఆ జంతువు ఉన్నట్లు ఈరోజు తెల్లవారుజామున ఆ వింత జీవిని రైతుల గుర్తించారు.
వింత జంతువును గుర్తించిన రైతులు దాని దగ్గరకు వెళ్లడానికి బయపడుతున్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడిన ఆ జంతువు బయట ఉన్న జనాలను చూసి భయంతో బయటకి, లోపలికి వెళ్తుందని ఆ ప్రాంతంలోని రైతులు చెబుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ విషయం గురించి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు,అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వింతజీవి ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ జంతువు ఏమిటి? ఏ జాతికి చెందినది అనే విషయాలు తెలియాలంటే ఆ జంతువును బావి నుంచి బయటకు తీస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి, ప్రజలను భయపెడుతున్న ఆ జంతువు ఏమిటనే విషయం తెలియదని అధికారులు తెలిపారు.బావి నుంచి ఆ జంతువును బయటకు తీయడానికి అధికారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఎంతో శ్రమిస్తున్నారు.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…