Featured

తూర్పుగోదావరి జిల్లాలో వింత జీవి ఏంటో తెలుసా?

తూర్పుగోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా ఒక వింత జీవి పర్యటిస్తూ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అంతేకాకుండా వింత జీవి స్థానికుల కంటపడకుండా ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో పశువులను చంపేస్తుంది. ఆ జంతువు ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుందో అనే భయంతో ఆ రెండు మండలాలలోని ప్రజలు నిత్యం భయపడుతూ ఇంటికి మాత్రమే పరిమితమై ఉన్నారు. ఈ విషయంపై ఎంతో ఆందోళన చెందిన రైతులు పశువులను చంపిన వింతజీవిని ఎట్టకేలకు గుర్తించారు.ఆలమూరు మండలం పెనికేరులోని బావిలో ఆ జంతువు ఉన్నట్లు ఈరోజు తెల్లవారుజామున ఆ వింత జీవిని రైతుల గుర్తించారు.

వింత జంతువును గుర్తించిన రైతులు దాని దగ్గరకు వెళ్లడానికి బయపడుతున్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడిన ఆ జంతువు బయట ఉన్న జనాలను చూసి భయంతో బయటకి, లోపలికి వెళ్తుందని ఆ ప్రాంతంలోని రైతులు చెబుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ విషయం గురించి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు,అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వింతజీవి ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ జంతువు ఏమిటి? ఏ జాతికి చెందినది అనే విషయాలు తెలియాలంటే ఆ జంతువును బావి నుంచి బయటకు తీస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి, ప్రజలను భయపెడుతున్న ఆ జంతువు ఏమిటనే విషయం తెలియదని అధికారులు తెలిపారు.బావి నుంచి ఆ జంతువును బయటకు తీయడానికి అధికారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఎంతో శ్రమిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago