తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అడుగు పెట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అందుకున్నాడు. అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. సినిమాల నుంచి సామాజిక అంశాల వరకు అతను తీసుకునే నిర్ణయాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి.
పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే అతడి మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ అనే సినిమా అని అందరికీ తెలిసిందే.అయితే అతడు ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అరవింద్ ఈ సినిమాను ఒక మీడియం రేంజ్ లో హీరోకు తగ్గట్లు తీశారు.
బడ్జెట్ కూడా చాలా తక్కువ అయింది. అప్పడు పవన్ కు నెలకు రూ.5వేలు ఇచ్చారట. షూటింగ్ పూర్తయ్యే వరకు పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు మొత్తం పారితోషకం రూ.50 వేల వరకు వచ్చిందట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ అదే ఫిగర్ కానీ వేలల్లో కాదు కోట్లల్లో. అవును ప్రస్తుతం పవన్ రూ.50 కోట్లు తీసుకుంటున్నాడు.
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ను సినిమా పరిశ్రమకు పరిచయం చెయ్యడానికి చాలా సినిమా కథలు పరిశీలించి చివరగా బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ఖయామత్ సే ఖయామత్ తక్ అనే చిత్రాన్ని రీమేక్ చెయ్యడానికి నిశ్చయించుకొని ఆ సినిమా నిర్మాణ బాధ్యతలను అల్లు అరవింద్ కు ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే పేరుతొ ఈ.వి .వి.సత్యనారాయణ తెరకెక్కించిన విషయం తెలిసిందే.
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…