తెలుగులో రాబోతున్న చిత్రాల్లో అఖండ ఒకటి. నందమూరి బాలకృష్ణ , ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్తో ఫుల్ హ్యాపీగా ఉన్న చిత్ర యూనిట్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఫ్రి రిలీజ్ ఈవెంట్లో ఓ సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.53 కోట్ల బిజినెస్ చేసింది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత పెద్ద ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన మొదటి తెలుగు సినిమాకు అఖండ రికార్టు స్పష్టించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 10.5 కోట్లు, సెడెడ్ లో రూ. 10.6 కోట్లు ఉత్తరాంధ్ర లో రూ. 6 కోట్లు, తూర్పుగోదావరి లో రూ. 4 కోట్లు, పశ్చిమ గోదావరి లో రూ. 3.5 కోట్లు, గుంటూరు లో రూ. 5.4 కోట్లు, కృష్ణా లో రూ. 3.7 కోట్లు, నెల్లూరు లో రూ.1.8 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం రూ. 45.5 CR, కర్ణాటక +భారతదేశంలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 2.5 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 53 CR, బ్రేక్ ఈవెన్ లో రూ. 54 కోట్లు వసూలు చేసింది.
రిలీజ్ కు ముందే ఇంత పెద్ద బిజినెస్ చేసిన అఖండ డిసెబంర్ 2 న ప్రపంచవ్యాప్తంగా 1400 థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు ఇంత పెద్ద బిజినెస్ చేసిన అఖండ సినిమా బిజినెస్ కు తగ్గట్లు వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అఖండ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా పేరు తెచ్చుకుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…