Pushpa-Allu Arjun: ఫ్యామిలీతో కలిసి న్యూఇయర్ వేడుకలకు బన్నీ ప్లాన్… ఎక్కడికి వెళ్లాడో తెలుసా..?
Pushpa-Allu Arjun: పుష్ప ఇచ్చిన సక్సెస్ కిక్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప భారీ వసూళ్లను రాబడుతోంది. ఊర మాస్ గెటప్ లో బన్నీ అదరగొట్టాడు. బన్నీ కెరీర్ లో తొలి ప్యాన్ ఇండియా సినిమా అయిన పుష్ప భారీ హిట్ కొట్టడంతో బన్నీ తెగ సంబరపడిపోతున్నాడు.
దీంతో పాటు త్వరలోనే పుష్ప-2 షూటింగ్ జరుగబోతోందనే సమాచారం కూడా వస్తోంది. అందుకు డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయి.. దసరాకు లేదా క్రిస్మస్ కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
అయితే పుష్ప సక్సెస్ తో బన్నీ, సుకుమార్ లు చెన్నై, హైదరాబాద్ లో సక్సెస్ పార్టీలు కూడా ఇచ్చారు. సక్సెస్ మీట్ లు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓసక్సెస్ మీట్ లో బన్నీ ఎమోషనల్ కూడా అయ్యాడు. సుకుమార్ లేకుంటే… స్టైలిష్ స్టార్.. ఐకాన్ స్టార్ అనేవి లేవని కంటతడి పెట్టాడు.
అయితే పుష్ప సినిమా ఇచ్చిన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. కొన్ని రోజులు ఫ్యామిలీలో సరదాగా టూర్ ప్లాన్ చేస్తున్నాడు. వరసగా పుష్ప ప్రమోషన్లతో, షూటింగ్ తో అలసిపోయిన బన్నీ.. ఇప్పుడు పుష్ప సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీలో కలిసి గోవా వెళ్తున్నాడు. అక్కడే 2022 కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు ప్లాన్ చేశాడు. తన భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్ లతో గడపడానికి విరామం తీసుకున్నాడు. మళ్లీ త్వరలోనే సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యే అవకాశం ఉండటంతో ఈకొద్ది సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించాడు బన్నీ. ఇదిలా ఉంటే సమంత కూడా తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి గోవాలోనే ఉంది.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…