ఇప్పటివరకు అంతరిక్షంలో మానవులు వెళ్లి ఎన్నో పరిశోధనలు చేశారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా బుల్లి జీవులను మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి పంపనుంది. ఆక్టోపస్ వంటి స్కిడ్స్, ఎలుగుబంటి (వాటర్ బేర్స్) ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోకి పంపనుంది. స్పేస్ ఎక్స్ సీఆర్ఎస్ -22 మిషన్ ద్వారా ఈ జీవరాసులను గురువారం అంతరిక్షంలోకి పంపనుంది. ఈ విధంగా బుల్లి జీవులను అంతరిక్షంలోకి పంపడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)ను 1998లో ప్రారంభించారు. భూమిపై సాధ్యం కాని పరిశోధనలను అంతరిక్షంలో చేయడానికి పరిశోధకులు ఈ కేంద్రాన్ని వినియోగించుకుంటారు. ఇప్పటికే ఈ కేంద్రం ద్వారా కొన్ని వేల పరిశోధనలు జరిగాయి. తాజాగా ఐఎస్ఎస్ ద్వారా మొట్టమొదటిసారి అంతరిక్షం లోకి ఎలుగుబంటి (వాటర్ బేర్స్) ను పంపించనున్నారు.
ఎనిమిది పాదాలు కలిగిన వాటర్ బేర్స్ సాధారణంగా జంతుజాలం జీవించే వాతావరణంలో కన్నా ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఇది జీవించగలవు. అందుకోసమే వీటిని అంతరిక్షంలోకి పంపి సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా పనిచేస్తుందనే విషయం తెలుసుకునేందుకు అధ్యయనం చేయనున్నారు. అదే విధంగా ఈ వాటర్ బేర్స్ సంతానాన్ని కూడా ఇక్కడే అభివృద్ధిపరిచే వాటిలో వచ్చేటటువంటి జన్యు మార్పులను గుర్తించబడుతుంది.
ఈ విధంగా అతి సూక్ష్మ జీవులను అంతరిక్షంలోకి పంపడానికి ద్వారా భవిష్యత్తులో రాబోయే కొన్ని సవాళ్లను అధిగమించడానికి ఈ అధ్యయనం ఎంతో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకోసమే ఈ బుల్లి జీవులను అంతరిక్షంలోకి పంపిస్తున్నట్లు నాసా వెల్లడించింది. సూక్ష్మజీవి–జంతువుల సహజీవనంపై అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం కోసమే ఈ పరిశోధనలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు జీవుల మధ్య ఏ విధమైనటువంటి గురుత్వాకర్షణ ప్రభావం ఉంటుందో సరిగా తెలియడం లేదు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…