ఇప్పటివరకు అంతరిక్షంలో మానవులు వెళ్లి ఎన్నో పరిశోధనలు చేశారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా బుల్లి జీవులను మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి పంపనుంది. ఆక్టోపస్ వంటి స్కిడ్స్, ఎలుగుబంటి (వాటర్ బేర్స్) ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోకి పంపనుంది. స్పేస్ ఎక్స్ సీఆర్ఎస్ -22 మిషన్ ద్వారా ఈ జీవరాసులను గురువారం అంతరిక్షంలోకి పంపనుంది. ఈ విధంగా బుల్లి జీవులను అంతరిక్షంలోకి పంపడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)ను 1998లో ప్రారంభించారు. భూమిపై సాధ్యం కాని పరిశోధనలను అంతరిక్షంలో చేయడానికి పరిశోధకులు ఈ కేంద్రాన్ని వినియోగించుకుంటారు. ఇప్పటికే ఈ కేంద్రం ద్వారా కొన్ని వేల పరిశోధనలు జరిగాయి. తాజాగా ఐఎస్ఎస్ ద్వారా మొట్టమొదటిసారి అంతరిక్షం లోకి ఎలుగుబంటి (వాటర్ బేర్స్) ను పంపించనున్నారు.
ఎనిమిది పాదాలు కలిగిన వాటర్ బేర్స్ సాధారణంగా జంతుజాలం జీవించే వాతావరణంలో కన్నా ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఇది జీవించగలవు. అందుకోసమే వీటిని అంతరిక్షంలోకి పంపి సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా పనిచేస్తుందనే విషయం తెలుసుకునేందుకు అధ్యయనం చేయనున్నారు. అదే విధంగా ఈ వాటర్ బేర్స్ సంతానాన్ని కూడా ఇక్కడే అభివృద్ధిపరిచే వాటిలో వచ్చేటటువంటి జన్యు మార్పులను గుర్తించబడుతుంది.
ఈ విధంగా అతి సూక్ష్మ జీవులను అంతరిక్షంలోకి పంపడానికి ద్వారా భవిష్యత్తులో రాబోయే కొన్ని సవాళ్లను అధిగమించడానికి ఈ అధ్యయనం ఎంతో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకోసమే ఈ బుల్లి జీవులను అంతరిక్షంలోకి పంపిస్తున్నట్లు నాసా వెల్లడించింది. సూక్ష్మజీవి–జంతువుల సహజీవనంపై అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం కోసమే ఈ పరిశోధనలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు జీవుల మధ్య ఏ విధమైనటువంటి గురుత్వాకర్షణ ప్రభావం ఉంటుందో సరిగా తెలియడం లేదు.
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…