సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో విడుదలైన ప్రేమ్ నగర్ సినిమా తో దగ్గుబాటి రామానాయుడు అక్కినేని నాగేశ్వరరావుల మధ్య స్నేహ బంధం మరింత పెరిగిందని చెప్పవచ్చు. అది ఒక దశలో ఎక్కడికి వెళ్ళింది అంటే నాగేశ్వర రావు కొడుకు నాగార్జున రామానాయుడు కూతురు లక్ష్మీ ల వివాహం వరకు వెళ్ళింది.ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం గా చెప్పవచ్చు.
అయితే నాగార్జున, లక్ష్మీ ల వివాహానికి దాదాపు రెండు నెలల ముందు వీరి వివాహము అంగరంగ వైభవంగా జరిపించాలని అటు దగ్గుబాటి ఇటు అక్కినేని కుటుంబాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆ క్రమంలో తెలుగు తమిళ కన్నడ హిందీ సినీ ప్రముఖులు హాజరవుతారు అన్న ఉద్దేశంతో ఒక పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కావాలని రామానాయుడు నాగేశ్వరరావు ఇద్దరూ మద్రాసులో ఎంత ప్రయత్నం చేసినా వీరికి ఒక మంచి ఫంక్షన్ హాల్ దొరకలేదు. ఆ క్రమంలో బి.నాగిరెడ్డిని కలిసినప్పుడు మీరు పెళ్లి పనులు చూసుకోండి.నేను మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ను చూసి పెడతాని బి.నాగిరెడ్డి అన్నారు.
సరిగ్గా యాభై నాలుగు రోజుల్లో అంటే పెళ్లికి ఆరు రోజుల ముందు బి.నాగిరెడ్డి తన విజయ గార్డెన్స్ లో విజయ శేష్ మహల్ నిర్మించి అక్కినేని నాగార్జున, దగ్గుబాటి లక్ష్మీ ల వివాహానికి సిద్ధం చేశారు. కేవలం 54 రోజుల్లో బి.నాగిరెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మించి ఇవ్వడం నాగేశ్వర రావు రామానాయుడు లను ఆశ్చర్యానికి గురి చేసింది. అలా నాగార్జున సినిమాల్లోకి రాకముందే దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీ తో 1984 ఫిబ్రవరి లో వివాహం జరిగింది.
అనివార్య కారణాల వలన నాగార్జున, లక్ష్మీ 1990లో డైవర్స్ తీసుకోవడం జరిగింది. నాగార్జున తో చాలా సినిమాల్లో నటించిన అమలతో 1992లో నాగార్జునకు వివాహమైంది. వీరి వివాహానికి గుర్తుగా 1994లో అఖిల్ జన్మించారు. నాగార్జున డైవర్స్ అనంతరం లక్ష్మి కూడా శరత్ అనే ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది. శరత్ కూడా లక్ష్మీ తో రెండో వివాహమే, శరత్ మొదటి భార్య కొడుకు మరియు నాగ చైతన్య కలిసి పెరగడం జరిగింది. శరత్ కొడుకు ప్రేమ వివాహానికి నాగ చైతన్య ఇటీవల కాలంలో హాజరయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…