Featured

రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మాస్క్ తీస్తే జైలు శిక్ష..!

దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి రైళ్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలల నుంచి పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. నవంబర్ నెల నుంచి పూర్తిస్థాయిలో ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అయితే రైల్వే శాఖ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెబుతోంది. రైల్వేశాఖ ప్రయాణికులు స్టేషన్ లోకి ప్రవేశించిన నిమిషం నుంచి ప్రయాణం ముగిసే వరకు తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ నుంచి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పడేయడం, రైలులో లేదా స్టేషన్ లో ఉమ్మి వేయడం నిషిద్ధమని రైల్వే శాఖ తెలిపింది.

ఎవరైనా కరోనా లక్షణాలు కనిపించడం వల్ల శాంపిళ్లను ఇచ్చినా కరోనా పాజిటివ్ వచ్చినా ప్రయాణానికి దూరంగా ఉండాలని రైల్వే శాఖ సూచిస్తోంది. ఎవరైనా రైల్వే శాఖ నియమనిబంధనలను పాటించకపోతే వారికి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తామని కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రైల్వే శాఖ క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచాలని భావిస్తోంది.

2021 జనవరి నాటికి ప్యాసింజర్ రైళ్లు కూడా అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ భావిస్తోంది. అప్పటిలోపు కరోనా వైరస్ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రజల్లో కరోనా వైరస్ గురించి భయాందోళన తగ్గడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

12 hours ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

13 hours ago

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే వేల రూపాయల తగ్గుదల.. తాజా ధరలు ఇవే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…

13 hours ago

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

1 day ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

1 day ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

1 day ago