భారతదేశంలో ఏర్పడిన ఈ విపత్కరమైన పరిస్థితులలో కొందరు సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణించగా మరికొందరు వైద్యుల నిర్లక్ష్యం వల్ల, వారి స్వార్థానికి ప్రాణాలు వదులుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితులలో ఆక్సిజన్, రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు దొరకక ప్రాణాలు కోల్పోతుంటే ఇదే అదునుగా చూసుకొని ఒక ప్రైవేట్ డాక్టర్ కాంపౌండర్ ఇంజెక్షన్ ల విషయంలో చేతివాటం ప్రదర్శించారు.
ప్రస్తుతమున్న కష్టకాలంలో రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను అమృతంగా భావిస్తున్నారు.అయితే ఈ విలువైన ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ దందాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.నిజామాబాద్లో ఒక ప్రైవేట్ డాక్టర్, కాంపౌండర్ ఇద్దరు కలిసి ప్రాణాలు నిలబెడుతున్న ఈ రెమ్డిసివర్ డ్రగ్లో సెలైన్ వాటర్ నింపి అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎంతో విలువైన రెమ్డిసివర్ వాడి పడేసిన బాటిళ్లలో సెలైన్ వాటర్ నింపి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఈ ఇంజక్షన్ దొరకక ఇబ్బందులు పడుతున్న బాధితులే లక్ష్యంగా వారు ఈ దందా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితుల నుంచి వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారుల దృష్టికి రావడంతో వారు వెంటనే రంగంలోకి దిగి ఈ విధమైనటువంటి దందా నిర్వహిస్తున్న ప్రైవేట్ డాక్టర్, కాంపౌండర్ ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…