భారతదేశంలో ఏర్పడిన ఈ విపత్కరమైన పరిస్థితులలో కొందరు సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణించగా మరికొందరు వైద్యుల నిర్లక్ష్యం వల్ల, వారి స్వార్థానికి ప్రాణాలు వదులుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితులలో ఆక్సిజన్, రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు దొరకక ప్రాణాలు కోల్పోతుంటే ఇదే అదునుగా చూసుకొని ఒక ప్రైవేట్ డాక్టర్ కాంపౌండర్ ఇంజెక్షన్ ల విషయంలో చేతివాటం ప్రదర్శించారు.
ప్రస్తుతమున్న కష్టకాలంలో రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను అమృతంగా భావిస్తున్నారు.అయితే ఈ విలువైన ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ దందాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.నిజామాబాద్లో ఒక ప్రైవేట్ డాక్టర్, కాంపౌండర్ ఇద్దరు కలిసి ప్రాణాలు నిలబెడుతున్న ఈ రెమ్డిసివర్ డ్రగ్లో సెలైన్ వాటర్ నింపి అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎంతో విలువైన రెమ్డిసివర్ వాడి పడేసిన బాటిళ్లలో సెలైన్ వాటర్ నింపి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఈ ఇంజక్షన్ దొరకక ఇబ్బందులు పడుతున్న బాధితులే లక్ష్యంగా వారు ఈ దందా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితుల నుంచి వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారుల దృష్టికి రావడంతో వారు వెంటనే రంగంలోకి దిగి ఈ విధమైనటువంటి దందా నిర్వహిస్తున్న ప్రైవేట్ డాక్టర్, కాంపౌండర్ ను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…