కరోనా మహమ్మారి విజృంభణ దేశంలోని ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతోంది. ప్రజలు కరోనా వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులను సైతం ఎదుర్కొంటున్నారు. కరోనా విజృంభణ తరువాత దేశంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఒక్కో సవాల్ ను అధిగమిస్తూ వచ్చింది. మొదట భారత్ పీపీఈ కిట్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడగా ప్రస్తుతం మన దేశం నుంచి ఇతర దేశాలకు పీపీఈ కిట్లు ఎగుమతి అవుతున్నాయి.
కరోనా వైరస్ నియంత్రణకు మోదీ సర్కార్ కొత్త నిర్ణయాలను అమలులోకి తెస్తోంది. శాస్త్రవేత్తలు గతంలోనే కుక్కల ద్వారా కరోనా వైరస్ ను గుర్తించవచ్చని తేల్చగా తాజాగా చేసిన ప్రయోగాల్లో కుక్కలు నూటికి నూరు శాతం కచ్చితత్వంతో వైరస్ ను గుర్తించగలుగుతాయని తేలింది. శాస్త్రవేత్తలు కుక్కలకు ఉన్న ఘ్రాణశక్తి వైరస్ ను గుర్తించడంలో సహాయపడుతుందని తెలుపుతున్నారు. శునక శిక్షకులు కుక్కలు వైరస్ ను గుర్తించడంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నట్టు వెల్లడిస్తున్నారు.
రద్దీ ప్రదేశాల్లో కుక్కల సహాయంలో సులువుగా కరోనా వైరస్ సోకిన వాళ్లను గుర్తించడం సాధ్యమవుతుంది. కరోనా వైరస్ ను వేగంగా గుర్తించడం వల్ల వైరస్ ను అదుపు చేయవచ్చు. ఇంటర్నేషనల్ కె9 బృందం చేసిన అధ్యయనంలో కుక్కలు వైరస్ ను గుర్తిస్తాయని ఖచ్చితంగా నమ్మవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శిక్షకులు మొదట చెమట, నడక ఆధారంగా వైరస్ ను గుర్తించేలా కుక్కలకు శిక్షణనిచ్చారు.
లెబనాన్, ఫిన్లాండ్ లలో ఇప్పటికే ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కల ద్వారా వైరస్ ను గుర్తించేందుకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కుక్కలు గుర్తించిన వారికి కరోనా పరీక్షలు చేయగా 92 శాతం మందికి కరోనా నిర్ధారించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…