దేశంలో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ లావాదేవీల కోసం వినియోగించే గూగుల్ పే యాప్ కస్టమర్లకు వరుస షాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. గూగుల్ పే తాజాగా చేసిన కొన్ని ప్రకటనలు యాప్ యూజర్లకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి గూగుల్ పే వెబ్ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. గూగుల్ పే భవిష్యత్తులో నగదు బదిలీ జరగాలంటే కూడా చార్జీలు విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయాలు అమలులోకి వస్తే మాత్రం గూగుల్ పే యాప్ కస్టమర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.
గూగుల్ పే మీడియా నివేదికల ద్వారా నగదు బదిలీకు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు సంకేతాలు ఇచ్చింది. అయితే నగదు బదిలీ చార్జీలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గూగుల్ పే వెబ్ అప్లికేషన్ లో పీర్ 2 పీర్ సేవలు 2021 నుంచి జనవరి నుంచి నిలిచిపోనున్నాయి. గూగుల్ పే కస్టమర్లకు ప్రస్తుతం పే.గూగుల్.కామ్ ద్వారా లావాదేవీలు జరుపుకోవడానికి అవకాశమిస్తున్న సంగతి తెలిసిందే.
గూగుల్ పే నోటీసులో వెబ్ యాప్ సేవల నిలిపివేతకు సంబంధించిన విషయాలను పేర్కొంది. అయితే వెబ్ యాప్ సేవలు నిలిచిపోయినా మొబైల్ లో గూగుల్ పే యాప్ వినియోగించే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం గూగుల్ పే యాప్ లో కస్టమర్ల కోసం కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. మొదట ప్రయోగాత్మకంగా అమెరికాలోని గూగుల్ పే కస్టమర్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
అయితే భవిష్యత్తులో మన దేశంలోని కస్టమర్లకు సైతం గూగుల్ పే కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. గూగుల్ పే నగదు లావాదేవీలకు ఛార్జీలను వసూలు చేస్తే మాత్రం యాప్ వినియోగించే కస్టమర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…