దేశంలో కరోనా పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. రోజుకో లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కేసుల సంఖ్య అధికంగా ఉండడంతో ఆస్పత్రిలోని మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ క్రమంలోనే చాలా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ క్రమంలోనే గోవా మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఆక్సిజన్ లభించక ఎనిమిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో ఈ ఆస్పత్రిలో గత కొంత కాలం నుంచి ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య 83 కు చేరింది.
ఆస్పత్రిలో రోజు ఆక్సిజన్ కొరత వల్ల బాధితులు చనిపోతుంటే ఆసుపత్రి వర్గాలు మాత్రం ఆక్సిజన్ కొరత వల్లే ప్రాణాలు కోల్పోయారని ధృవీకరించడం లేదు. కేవలం కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్లే రోగుల మృతి చెందుతున్నారని వైద్యులు సూచించినప్పటికీ, ఆస్పత్రిలోని నర్సులు, రోగుల బంధువులు రాత్రి సమయంలో ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్లే కరోనా బాధితులు మృత్యువాత పడుతున్నట్లు చెబుతున్నారు.
ఈ విధమైనటువంటి ఆక్సిజన్ కొరత సమస్య కేవలం గోవా ఆసుపత్రిలో మాత్రమే కాకుండా ఈ విధమైనటువంటి దారుణ పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొన్నాయని, ఆక్సిజన్ లభించక ఎంతోమంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…