Jabardasth Varsha: వర్ష అమ్మాయి కాదు… అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఇమ్మాన్యుయెల్.. ఏడుస్తూ వెళ్ళిపోయిన వర్ష!
Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమంలో సుధీర్ రష్మీ జంట తర్వాత అంతటి క్రేజ్ ఉన్న వారిగా గుర్తింపు పొందిన వారిలో ఇమ్మాన్యుయెల్, రష్మీ జంట ఒకటి. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈ జంట చేసే సందడి మామూలుగా ఉండదు. వీరిద్దరికి ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని షో నిర్వాహకులు వీరి చేత పలురకాల స్కిట్ చేయిస్తూ కార్యక్రమ రేటింగ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఈ జంట కేవలం జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమంలోనూ అలాగే ఏదైనా స్పెషల్ ఈవెంట్ లో కూడా సందడి చేస్తుంటారు.ఇకపోతే ఏదైనా పండుగ వస్తుందంటే మల్లెమాల వారు స్పెషల్ ఈవెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఇక హోలీ ఈ పండుగ సందర్భంగా రంగ్ దే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ వర్ష,ఇమ్మాన్యుయెల్ మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయెల్ వర్షను ఉద్దేశిస్తూ… వర్ష అమ్మాయి కాదు…తన ది లేడీ గెటప్ అంటూ పరోక్షంగా తను అబ్బాయని అందరి ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒక్కసారిగా ఇమ్మాన్యుయెల్ వర్ష గురించి అలా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మాయిలు ఒక వైపు అబ్బాయిలు ఒక వైపు కూర్చొని ఒకరిపై ఒకరు పంచులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయెల్ అసలు వర్ష ఇటు వైపు కూర్చుని మాట్లాడాలి ఎందుకంటే తను అమ్మాయి కాదని చెప్పగా వెంటనే బుల్లెట్ భాస్కర్ ప్రతిసారి అలా అనకూడదు. మనం అలా అనటం వల్ల బయట చాలా మంది కూడా అలాగే అనుకుంటారు. నా భార్య కూడా వర్ష అమ్మాయి కాదా.. లేడీ గెటప్పా.. అంటూ అడిగిందని బుల్లెట్ భాస్కర్ అనటంతో వర్ష ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇలా మాట్లాడటం మంచిది కాదు నీ అసలు రూపం ఇదే అంటూ ఏడుస్తూ వెళ్లిపోయారు. అయితే ఇదంతా కూడా స్కిట్ లో భాగమా లేకపోతే నిజంగానే జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…