Featured

Ex Minister Annayyagari Sai Prathap : ఆ పత్రికలు పబ్లిసిటీ చేయక ముందే జంధ్యం తీసేయమన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి…!

Ex Minister Annayyagari Sai Prathap : సుధీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో విధేయుడుగా ఉంటూ రాజంపేట నుండి లోకసభకు ప్రాతినిద్యం వహించిన అన్నయ్యగారి సాయి ప్రతాప్ గారు ఇటీవల జరిగిన బలిజ సభలలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు. తాను క్షత్రియ బలిజ అవడం వల్ల ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. అలాగే తనకు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కి ఉన్న స్నేహం గురించి తెలిపారు.

పత్రికల్లో రాసే ముందే జంజం తీసేయ్…

రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో మొదటి నుండి మిత్రుడని, మా ఇద్దరిది మంచి స్నేహం అంటూ కులాలు వేరైనా పెద్దలు నేర్పించిన సంస్కారం వల్లే మా స్నేహం నిలబడింది అంటూ బలిజ సభలో తెలిపారు. ఇక రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో తనకు 1984 లో అడగకుండానే పార్లమెంటుకు పోటీ చేయమని టికెట్ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి అంటూ అప్పటి విషయాన్ని చెప్పారు. నన్ను ఒక్కమాటైనా అడగలేదు నేను పోటీ చేయను అంటే అని సాయి ప్రతాప్ అనగా నీ చేత్తో కొంచం విషం ఇవ్వు సాయి అని అంటూ రాజశేఖర్ రెడ్డి చెప్పారట.

ఇక ఆ సమయంలో ఒక బలిజ కులస్థుడికి సీట్ ఇచ్చామని చెబుతే ఒక కాంగ్రెస్ నేత అతను బలిజ కాదు క్షత్రియుడు రాజుల వంశానికి చెందిన వాడు అని అన్నారట. వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు అడిగితే అవును నాకు జంధ్యం ఉంది పెనుగొండ రాజులకు బంధువులం, రాయల వారు అన్నయ్య అని మా పూర్వికులను పిలవడం వల్లే మాకు అన్నయ్యగారి అనే ఇంటి పేరు వచ్చింది అని చెప్పగా అవన్నీ నాకు తెలియదు సాయి కానీ పత్రికల వాళ్ళు ప్రచారం చేయకముందే ఆ జంధ్యం తీసేయ్ నాకోసం అని అడిగారట. అలా బ్రాహ్మనుల ద్వారా శాస్త్రోక్తంగా జంధ్యం తీసేసారట ప్రతాప్ సాయి గారు. ప్రతాప్ సాయి గారు బలిజ కులస్థుడైనా రాజ వంశానికి చెందినవాడు అని క్లారిటీ ఇచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago