General News

రక్తంతో కేఎఫ్‌సీ రెస్టారెంట్ హడలెత్తించిన యువతి.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచంలో వెగాన్ ఉద్యమం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు వెగాన్ ఉద్యమకారులు కేఎఫ్‌సీ రెస్టారెంట్‌కు వెళ్లి రెస్టారెంట్ మొత్తం రక్తం చిమ్మి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన కస్టమర్లు ఈ గొడవ మనకెందుకు అంటూ కొంతమంది అక్కడి నుంచి తప్పించుకున్నారు.

సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇటీవల కాలంలో వెగన్ ఉద్యమం ఊపందుకుంది. అంటే శాఖాహార ఉద్యమం. ఈ ఉద్యమం సదరు మనిషి కనీసం పాలు తాగినా కూడా జీవహింస అని భావిస్తున్నారు. అలాంటిది కోడి పిల్లలను చంపి వాటిని వివిధ రకాలుగా తయారు చేసుకుని తింటే ఊరికే ఉంటారా. అందుకే ఈ ఉద్యమకారులు కేఎఫ్‌సీ రెస్టారెంట్‌కు వెళ్లి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో కొంతమంది వెగన్ ఉద్యమకారులు కేఎఫ్‌సీ రెస్టారెంట్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు మైక్ లను ఎల్ఈడి స్క్రీన్ లను అదేవిధంగా ఒక బాటిల్ లో రక్తం తీసుకుని వెళ్లారు.మనం మన అవసరాల కోసం జీవహింస చేసేటప్పుడు అవి ఏ విధమైనటువంటి నొప్పిని భరిస్తాయో ఎల్ఈడి స్క్రీన్ పై చూపెడుతూ, అవి చేసే అర్థనాదాలను మైక్ ద్వారా వినిపించింది.

https://www.facebook.com/vganbooty/videos/882536905805679/

ఈ విధంగా ఉద్యమకారులు రెస్టారెంట్లో తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే తమ వద్ద బాటిల్లో తెచ్చుకున్న రక్తాన్ని మూతతీసి రెస్టారెంట్లో, కౌంటర్ వద్ద ఓ మహిళ చల్లగా అక్కడ ఉన్న సిబ్బంది ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అదేవిధంగా ఆ మహిళతో పాటు వచ్చిన మరికొందరు ప్లకార్డులను చేతిలో పట్టుకొని జంతు హింస వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ విధంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే రెస్టారెంట్ యాజమాన్యం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago