ప్రస్తుతం ప్రపంచంలో వెగాన్ ఉద్యమం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు వెగాన్ ఉద్యమకారులు కేఎఫ్సీ రెస్టారెంట్కు వెళ్లి రెస్టారెంట్ మొత్తం రక్తం చిమ్మి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన కస్టమర్లు ఈ గొడవ మనకెందుకు అంటూ కొంతమంది అక్కడి నుంచి తప్పించుకున్నారు.

సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇటీవల కాలంలో వెగన్ ఉద్యమం ఊపందుకుంది. అంటే శాఖాహార ఉద్యమం. ఈ ఉద్యమం సదరు మనిషి కనీసం పాలు తాగినా కూడా జీవహింస అని భావిస్తున్నారు. అలాంటిది కోడి పిల్లలను చంపి వాటిని వివిధ రకాలుగా తయారు చేసుకుని తింటే ఊరికే ఉంటారా. అందుకే ఈ ఉద్యమకారులు కేఎఫ్సీ రెస్టారెంట్కు వెళ్లి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో కొంతమంది వెగన్ ఉద్యమకారులు కేఎఫ్సీ రెస్టారెంట్లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు మైక్ లను ఎల్ఈడి స్క్రీన్ లను అదేవిధంగా ఒక బాటిల్ లో రక్తం తీసుకుని వెళ్లారు.మనం మన అవసరాల కోసం జీవహింస చేసేటప్పుడు అవి ఏ విధమైనటువంటి నొప్పిని భరిస్తాయో ఎల్ఈడి స్క్రీన్ పై చూపెడుతూ, అవి చేసే అర్థనాదాలను మైక్ ద్వారా వినిపించింది.
https://www.facebook.com/vganbooty/videos/882536905805679/
ఈ విధంగా ఉద్యమకారులు రెస్టారెంట్లో తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే తమ వద్ద బాటిల్లో తెచ్చుకున్న రక్తాన్ని మూతతీసి రెస్టారెంట్లో, కౌంటర్ వద్ద ఓ మహిళ చల్లగా అక్కడ ఉన్న సిబ్బంది ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అదేవిధంగా ఆ మహిళతో పాటు వచ్చిన మరికొందరు ప్లకార్డులను చేతిలో పట్టుకొని జంతు హింస వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ విధంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే రెస్టారెంట్ యాజమాన్యం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించారు.































