ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా రెండవ దశ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ రూపంలో ముంచుకొస్తే రెండవ దశ కన్నా రెట్టింపు స్థాయిలో కేసులు నమోదు అవుతాయని అందుకే ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 40 నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం మధ్యప్రదేశ్ లో నమోదయిందని అధికారులు వెల్లడించారు. కోవిడ్ -19 తో మృతిచెందిన వ్యక్తి జన్యు నమూనాలను పరీక్షించగా అసలు విషయం బయట పడినట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు ఐదు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు కోలుకోగా ఉజ్జయినికి చెందిన ఓ మహిళ మృత్యువాత పడినట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి కోలుకున్న నలుగురు 2 డోసుల వ్యాక్సిన్ పూర్తిగా వేయించుకున్నారు. చనిపోయిన మహిళ ఒక డోస్ పూర్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా ఉజ్జయిని కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రౌనక్ వెల్లడించారు.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ రూపంలో ముంచుకొస్తుందని, ఇది రెండవ దశ కంటే తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలను పాటిస్తూ, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు ఆదేశించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…