ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా రెండవ దశ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ రూపంలో ముంచుకొస్తే రెండవ దశ కన్నా రెట్టింపు స్థాయిలో కేసులు నమోదు అవుతాయని అందుకే ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 40 నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం మధ్యప్రదేశ్ లో నమోదయిందని అధికారులు వెల్లడించారు. కోవిడ్ -19 తో మృతిచెందిన వ్యక్తి జన్యు నమూనాలను పరీక్షించగా అసలు విషయం బయట పడినట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు ఐదు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు కోలుకోగా ఉజ్జయినికి చెందిన ఓ మహిళ మృత్యువాత పడినట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి కోలుకున్న నలుగురు 2 డోసుల వ్యాక్సిన్ పూర్తిగా వేయించుకున్నారు. చనిపోయిన మహిళ ఒక డోస్ పూర్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా ఉజ్జయిని కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రౌనక్ వెల్లడించారు.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ రూపంలో ముంచుకొస్తుందని, ఇది రెండవ దశ కంటే తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలను పాటిస్తూ, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు ఆదేశించారు.
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…