సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ కు భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు.గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నియమాలను పాటించాలని వివిధ సోషల్ మీడియా సంస్థలకు తెలిపిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ సంస్థలకు సంబంధించిన అధికారుల వివరాలను వెల్లడించాలని కేంద్రం తెలుపగా అన్ని సంస్థలు అధికారుల వివరాలను వెల్లడించినప్పటికీ ట్విట్టర్ మాత్రం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటించలేదు.
మన దేశంలో కొత్త ఐటీ చట్టాల ప్రకారం స్టాట్యుటరీ ఆఫీసర్లను నియమించడంలో విఫలమైన ట్విట్టర్కు పెద్ద షాక్ తగిలింది. దీంతో మధ్యవర్తి హోదాను కోల్పోయింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ పై ఎలాంటి అవకతవకలు జరిగిన ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర్నుంచి టాప్ ఎగ్జిక్యూటీవ్స్ వరకు పోలీసులు విచారణ జరిగే అవకాశాలు ఉంటాయి.
ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సప్ లాంటివాటికి ఈ రక్షణ కవచం ఉంది. కానీ ట్విట్టర్ కి ఈ రక్షణ కవచం లేదనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ట్విట్టర్ భారత దేశంలో మధ్యంతర చీఫ్ కాంప్లయెన్స్ నియమించామని వారి వివరాలను మంగళవారం ఐటి శాఖకు వివరిస్తామని తెలిపిన ట్విట్టర్ ఆ రూల్స్ ని అమలు చేయకపోవడంతో మధ్యవర్తి హోదాను కోల్పోయింది.
ఇదివరకే కేంద్రప్రభుత్వం కొత్త ఐటీ రూల్స్ కి అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే చట్టపరమైన రక్షణ ను కోల్పోతారని తెలుపుతూ జూన్ 5వ తేదీన కేంద్రం ట్విట్టర్ కి ఆదేశాలు జారీచేసింది. ఈ విధంగా ట్విట్టర్ సంస్థకు పదే పదే గుర్తు చేసినప్పటికీ ట్విట్టర్ నుంచి సానుకూల ప్రభావం రాకపోవడంతోనే ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది.ఈ విధంగా ట్విట్టర్ రక్షణ కవచం కోల్పోవడంతో ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి మొట్టమొదటిసారిగా ట్విట్టర్ పై కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…