Categories: FeaturedHealth News

చేపలు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..! ఇంకా ఎన్నో సమస్యలకు చెక్..

ప్రస్తుతం కరోనా కాలంలో ప్రతీ ఒక్కరూ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి వివిధ రకాల పండ్లను, మాంసాహార పదర్ధాలను తింటున్నారు. మాంసాహార పదర్థాల్లో మనకు ముఖ్యంగా లభించే వాటిల్లో చేపలు ఒకటి. వీటిని ఎక్కువగా ఇష్టపడటానికి గల కారణం ఏంటంటే.. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందుకే వారంలో కనీసం రెండు సార్లయినా చేపలు తింటే.. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. హార్ట్ ఎటాక్, మెదడు సంబంధింత సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చని పేర్కొంటున్నారు. చేపల్లో కొవ్వు తక్కువగా ఉంటమే కాకుండా అందులో నాణ్యమైన ప్రోటీన్స్ లభిస్తాయి. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. చేపలు తినడం వల్ల.. జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మెదడు బాగా పనిచేస్తుంది. గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు.

ముఖ్యంగా దీనిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీని ఫలితంగానే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. రక్తం సరఫరాకు ఉపయోగపడుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. విటమిన్ డి కూడా లభిస్తుంది. స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే చేపలు తినాలి. కంటి చూపు మెరుగు అవుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు చేపలు తినడం వల్ల సమస్యలు తొలగిపోతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అంతేకాకుండా టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చేపలు తింటే మంచిదంటుననారు నిపుణులు. రక్త హీనతతో బాధపడేవారు ఈ చేపలు తినడం వల్ల హిమోగ్లీబిన్ సరిపడా ఉండేలా చేస్తుంది. పేగుల్లో గ్యాస్ ఇతరత్రా సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి. శరీర ఉష్ణోగ్రతను చేపలు క్రమబద్ధీకరించి.. శక్తిని అందిస్తాయి. చేపల్లో ఉండే జింక్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago