ప్రస్తుతం కరోనా కాలంలో ప్రతీ ఒక్కరూ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి వివిధ రకాల పండ్లను, మాంసాహార పదర్ధాలను తింటున్నారు. మాంసాహార పదర్థాల్లో మనకు ముఖ్యంగా లభించే వాటిల్లో చేపలు ఒకటి. వీటిని ఎక్కువగా ఇష్టపడటానికి గల కారణం ఏంటంటే.. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అందుకే వారంలో కనీసం రెండు సార్లయినా చేపలు తింటే.. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్లో ఉంటాయి. హార్ట్ ఎటాక్, మెదడు సంబంధింత సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చని పేర్కొంటున్నారు. చేపల్లో కొవ్వు తక్కువగా ఉంటమే కాకుండా అందులో నాణ్యమైన ప్రోటీన్స్ లభిస్తాయి. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. చేపలు తినడం వల్ల.. జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మెదడు బాగా పనిచేస్తుంది. గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు.
ముఖ్యంగా దీనిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీని ఫలితంగానే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. రక్తం సరఫరాకు ఉపయోగపడుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. విటమిన్ డి కూడా లభిస్తుంది. స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే చేపలు తినాలి. కంటి చూపు మెరుగు అవుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు చేపలు తినడం వల్ల సమస్యలు తొలగిపోతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్నవారు చేపలు తింటే మంచిదంటుననారు నిపుణులు. రక్త హీనతతో బాధపడేవారు ఈ చేపలు తినడం వల్ల హిమోగ్లీబిన్ సరిపడా ఉండేలా చేస్తుంది. పేగుల్లో గ్యాస్ ఇతరత్రా సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి. శరీర ఉష్ణోగ్రతను చేపలు క్రమబద్ధీకరించి.. శక్తిని అందిస్తాయి. చేపల్లో ఉండే జింక్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…