విజయవాడకు చెందిన కాట్రగడ్డ మురారి ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదులలో యంబీబీయస్ చదువుతూ మధ్యలో ఆపి మద్రాసు చేరి సినిమా రంగంలో ప్రవేశించాడు.మురారి మొదటగా కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసి తర్వాత యువచిత్ర ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించాడు. తన సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువగా కె. వి.మహదేవన్ స్వరపరిచినవి. సీతామాలక్ష్మి, గోరింటాకు, జేగంటలు, త్రిశూలం, శ్రీనివాస కళ్యాణం, జానకిరాముడు, నారీ నారీ నడుమ మురారి. లాంటి చిత్రాలు ఆయన రూపొందించారు. 2012 లో ఆయన ఆత్మకథ నవ్విపోదురు గాక అనే పుస్తక రూపంలో విడుదల చేశారు. ఈ పుస్తకంలో కొందరు సినీ ప్రముఖులపై విమర్శలు చేశాడు.
నాగార్జున కథానాయకునిగా నిర్మాత కాట్రగడ్డ మురారి సినిమా తీద్దామని భావించి విజయేంద్ర ప్రసాద్ తో కథ రాయించారు. తర్వాతికాలంలో పలు విజయవంతమైన చిత్రాలకు కథను అందించిన విజయేంద్రప్రసాద్ కు కథారచయితగా ఇదే తొలి చిత్రం. మూగ మనసులు సినిమా ఇతివృత్తమే కావాలి కానీ కథనం, నేపథ్యం కొత్తగా ఉండాలని మురారి కోరుకోవడంతో అలాగే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో జానకి రాముడు సినిమా తీశారు. సినిమాను అభివృద్ధి దశలోనే “మూగ మనసులు” ఇతివృత్తం ఆధారంగానే తీద్దామని నిర్ణయించుకోవడంతో ఈ సినిమా కథపై మూగమనసులు చిత్ర ప్రభావం ఉంది.
ఈ కథ రాము (నాగార్జున) మరియు జానకి (విజయశాంతి) మధ్య ఎటర్నల్ లవ్ స్టోరీతో రెండు విభిన్న కాలక్రమంలో ఉంటుంది. రాముడు మరియు జానకి ఒక గ్రామాన్ని సందర్శించే ఆధునిక ప్రేమికులుగా ఉన్న ప్రస్తుత కాలక్రమంతో చిత్రం ప్రారంభమవుతుంది. ఆ ప్రదేశానికి చేరుకోవడం ద్వారా వారు తమ గత జీవితాలను గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తారు. కథ వారి గత జీవితంలోకి తిరిగి వెళుతుంది, అక్కడ లక్ష్మి నృత్యం మరియు సంగీతం పట్ల మక్కువ ఉన్న గ్రామస్థురాలు మరియు రంగా ఆమెకు ఎలా పాడాలో నేర్పుతుంది. వారి గ్రామంలోని కొన్ని కష్టాలు మరియు ఆర్థిక వ్యత్యాసాల కారణంగా, వారు విచారకరమైన పరిస్థితులలో మరణిస్తారు. వారి ప్రేమ అమరత్వంతో, వారు ప్రస్తుత యుగంలో పునర్జన్మ పొందారు. ప్రస్తుత కాలంలో రాము, జానకి ఒక్కటవుతారా అన్నదే మిగతా కథ.
అయితే నిర్మాత మురారి మాట్లాడుతూ.. “జానకిరాముడు’ చిత్రం అనుకున్నప్పుడు “మూగమనసులు” సినిమా ఆధారంగా కథ రాసుకున్నాం.. నాగార్జునకు హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు.. నేను హీరోయిన్ గౌతమి అయితే బాగుంటుందనుకున్నాను కానీ దర్శకుడు రాఘవేంద్రరావు విజయశాంతిని సూచించారు. నాగార్జన కంటే సీనియర్ హీరోలతో విజయశాంతి నటించి ఉండడంతో నాగార్జునకు ఆమె అక్కలా ఉంటుందన్నాను. అయినా రాఘవేంద్రరావు విజయశాంతినే హీరోయిన్ గా తీసుకున్నారని ఆ ఇంటర్వ్యూలో అప్పటి జ్ఞాపకాలను ఒక్కసారి కాట్రగడ్డ మురారి గుర్తు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…