Floods effect in Telangana : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు తెలంగాణ చిగురుటాకులా వణికింది. ఒకవైపు రాజధాని నగరంలో ఎక్కడికక్కడ ముంపు ఏర్పడి ట్రాఫిక్ కష్టాలతో జనాలు ఇబ్బంది పడితే మరోవైపు పల్లెలు ఆకస్మాత్తుగా వచ్చిన వరదకు అతలాకుతలం అయ్యాయి. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వరద బీభత్సానికి ఊరు ఊరే మునిగిపోయింది. ఇల్లు సామాను అన్నీ నీటి పాలై స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు.
చూస్తున్నట్లుగానే జనాలు, పశువులు కొట్టుకుపోయాయి…
భారీగా కుండపోత వాన కురవడంతో మోరంచ వాగు ఉప్పొంగడంతో ఒక్కసారిగా గ్రామంలోకి నీరు చేరింది. అందరూ నిద్ర పోతున్న సమయంలో తెల్లవారుజామున 4:27 నిమిషాల నుండి 4:50 నిమిషాల సమయంలో ఒక్కసారిగా ఉదృతంగా నీరు రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. కట్టుబట్టలతో చెట్లను ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. కొంతమంది వరదలో కొట్టుకుపోయారు. పశువులు కూడా కొట్టుకుపోయాయి.
ఇప్పటికీ కొట్టుకు పోయిన వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. భర్త పోయి ఒకరు, భార్య పోయి ఒకరు, అమ్మ పోయి ఒకరు, కూతురు పోయి ఒకరు ఇలా ఒక్కో కుటుంబాన్ని కదిలిస్తే ఒక్కో విషాద గాధ వినిపిస్తోంది. ప్రభుత్వం నుండి ముందస్తు హెచ్చరికలు రాలేదని ఒక్కసారిగా వరద పోటెత్తడం, సుమారు 17 అడుగుల మేర నీరు రావడంతో ఊరు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అంటూ స్థానికులు బాధపడుతున్నారు. ఇది మాకు పునర్జన్మలాగా అనిపిస్తుంది. మాకిక ఈ ఊరు వద్దు వేరే ఎక్కడైనా ప్రభుత్వం స్థలం చూపిస్తే వెళ్ళిపోతాం అంటూ రోధిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…