Sai Kumari: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా రోడ్డు పక్కన ఉండే ఫుడ్ స్టాల్ లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. హోటల్స్ కాకుండా రోడ్డు పక్కన చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అలా ఇటీవల కాలంలో యూట్యూబ్ లలో బాగా ఫేమస్ అయిన వారిలో సాయి కుమారి కూడా ఒకరు. సాయి కుమారి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆమె ఫోటో చూస్తే చాలు ఓహో ఈమైనా అంటూ గుర్తుపట్టిస్తారు. తన స్టాల్ దగ్గర వచ్చి కస్టమర్లను ఎంతో ప్రేమగా నానా చెప్పు కన్నా అని పలకరిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా సాయికుమారి చేసే వంటకాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిరంతరం ఆమె స్టాల్ దగ్గర ఎప్పుడు రష్ గానే ఉంటుందని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో చాలానే ఉన్నాయి. టేస్టీగా ఉండే వెజ్, నాన్ వెజ్ వంటకాలను సాయికుమారి మిగతా హోటళ్లు, రెస్టారెంట్లతో పోల్చి చూస్తే తక్కువ ధరలకే అందిస్తుండటంతో పాటు ప్రేమగా భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది.
తాజాగా ఈ మూవీ టీం సాయికుమారి ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లి వంటలను రుచి చూడటంతో పాటు ఆ వంటలను మెచ్చుకున్నారు. హీరో సందీప్ కిషన్ తో పాటు హీరోయిన్లు వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫుడ్ కోర్ట్ లో వంటకాలను రుచి చూశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాయికుమారి నెల సంపాదన ఏకంగా రెండున్నర లక్షల రూపాయలకు అటూఇటూ ఉంటుందని తెలుస్తోంది.
అదంతా ప్రమోషన్స్ కోసమే..
ఫుడ్ స్టాల్ ద్వారా ఇంత భారీ రేంజ్ లో సంపాదించడం అంటే సులువు కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఊరు పేరు భైరవకోన టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో సాయికుమారి ఫుడ్ స్టాల్ పేరు మరోసారి మారుమ్రోగుతోంది. ఊరు పేరు భైరవకోన సినిమా విషయానికి వస్తే.. 27 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…