Free bus travel for women in Andhra Pradesh.. to be implemented from August 15
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా దృష్టి సారించారు. ఈ పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలని అధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం, ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఈ మేరకు ‘జీరో ఫేర్ టికెట్’ని అందించాలంటూ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఈ టికెట్లో ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగిందో, ఉచిత ప్రయాణంతో ఎంత మేర డబ్బు ఆదా అయ్యిందో వంటి వివరాలు ఉండేలా చేయాలన్నారు. ఈ విధంగా ప్రయోజనాన్ని పారదర్శకంగా చూపించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది.
పథకం అమలుతో ఆర్టీసీపై వచ్చే భారం పెరగకుండా చూడాలన్నదే సీఎం దృష్టి. అందుకే నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు వ్యూహాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదాయ మార్గాలను అన్వేషించడంలో వేగం పెంచాలని తెలిపారు. ఇందులో భాగంగా ఇకపై ఆర్టీసీకి ఏసీ ఎలక్ట్రిక్ బస్సులనే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. వీటి ద్వారా వ్యయాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ దోహదం చేస్తుందని చెప్పారు.
ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన విద్యుత్ను ఆర్టీసీ స్వయంగా ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని ఆర్టీసీ డిపోలలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అధ్యయనం చేసి, త్వరగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ చర్యలతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మరింత సమర్థవంతంగా, మహిళలకు అనుకూలంగా మార్చాలన్నదే చంద్రబాబు లక్ష్యం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…