"Book my show ratings, likes are all about money!" Producer Naga Vamsi's sensational comments!
హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ మరోసారి సినీ ఫ్యాన్ వార్స్పై బాంబ్ పేల్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా, బుక్ మై షో వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లపై వస్తున్న లైక్స్, రేటింగ్స్, రివ్యూలన్నీ అంతా ఒక మాయాజాలం మాత్రమేనని ఆయన చెప్పిన తీరు సంచలనం సృష్టిస్తోంది.
నాగవంశీ స్పష్టం చేస్తూ, “ఒకే సమయంలో రెండు సినిమాలు రిలీజైతే, ఫ్యాన్స్ గట్టిగా అడుగుతున్నారు – వాళ్ల సినిమా బుక్ మై షోలో 90% రేటింగ్.. మనది 82% ఎందుకు? లైక్స్ పెంచండి, లేకపోతే ఫ్యాన్స్ తిడతారు! అంటున్నారు. దాంతో, ‘అయ్యో మంచిదే.. డబ్బులు ఇచ్చి రేటింగులు పెడదాం’ అని అన్నారు.
అంతే కాకుండా, “యూట్యూబ్ వ్యూస్ కూడా డబ్బుతోనే. రేటింగ్స్, లైక్స్ – అన్నీ పెయిడ్. ఫ్యాన్స్ కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దాంతో నిర్మాతలకే నష్టం వస్తోంది. అందుకే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పుడు బుక్ మై షో ప్రమోషన్లకు బ్రేక్ వేసింది,” అని వెల్లడించారు.
నాగ వంశీ మరో కీలక అంశాన్ని బయటపెట్టారు. సినిమా విడుదలైన తొలి రోజు ఉదయం 6 గంటలకే ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్లో దర్శనమిచ్చే రివ్యూలు, అంచనాలు—అన్నీ నిర్మాతలు నడిపే ఆటలో భాగమే అని అన్నారు. “మాకు నచ్చే వాళ్లు పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. నచ్చని వాళ్లు నెగిటివ్ రివ్యూలు ఇస్తారు. ఇది ఒక మేనేజ్డ్ ప్రపంచం. ఆడియెన్స్ వీటిని చూసి మోసపోవొద్దు,” అని సూచించారు.
“ఈ వ్యవహారాల్లో హీరోలు పాలుపంచుకోరు. ఫ్యాన్స్ మోజు కోసమే డబ్బులిచ్చి వీటిని కొంటున్నాం. వాళ్లకు తమ హీరో సినిమానే గ్రేట్ అనిపించాలి. కానీ నిజం చెప్పాలంటే, ఇవన్నీ మార్కెటింగ్ గిమిక్స్ మాత్రమే,” అని నాగవంశీ బేషరతుగా అన్నారు.
ఈ వ్యాఖ్యలతో నిర్మాత నాగవంశీ టాలీవుడ్ మార్కెటింగ్ మాయాజాలానికి తెర తీసినట్టే అయ్యారు. “మా హీరో మాస్, బాస్, పీక్స్” అనే అభిమానుల నినాదాల వెనుక డబ్బు నింపిన గణాంకాల నిజం బయటపడింది. ఇక మీదట ప్రేక్షకులు, ఫ్యాన్స్ నిజమైన టాలెంట్కి విలువ ఇస్తారా? లేక ఈ ఫేక్ హైప్ గేమ్కి మరింత బలవుతారా అన్నది వేచి చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…