"Book my show ratings, likes are all about money!" Producer Naga Vamsi's sensational comments!
హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ మరోసారి సినీ ఫ్యాన్ వార్స్పై బాంబ్ పేల్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా, బుక్ మై షో వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లపై వస్తున్న లైక్స్, రేటింగ్స్, రివ్యూలన్నీ అంతా ఒక మాయాజాలం మాత్రమేనని ఆయన చెప్పిన తీరు సంచలనం సృష్టిస్తోంది.
నాగవంశీ స్పష్టం చేస్తూ, “ఒకే సమయంలో రెండు సినిమాలు రిలీజైతే, ఫ్యాన్స్ గట్టిగా అడుగుతున్నారు – వాళ్ల సినిమా బుక్ మై షోలో 90% రేటింగ్.. మనది 82% ఎందుకు? లైక్స్ పెంచండి, లేకపోతే ఫ్యాన్స్ తిడతారు! అంటున్నారు. దాంతో, ‘అయ్యో మంచిదే.. డబ్బులు ఇచ్చి రేటింగులు పెడదాం’ అని అన్నారు.
అంతే కాకుండా, “యూట్యూబ్ వ్యూస్ కూడా డబ్బుతోనే. రేటింగ్స్, లైక్స్ – అన్నీ పెయిడ్. ఫ్యాన్స్ కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దాంతో నిర్మాతలకే నష్టం వస్తోంది. అందుకే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పుడు బుక్ మై షో ప్రమోషన్లకు బ్రేక్ వేసింది,” అని వెల్లడించారు.
నాగ వంశీ మరో కీలక అంశాన్ని బయటపెట్టారు. సినిమా విడుదలైన తొలి రోజు ఉదయం 6 గంటలకే ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్లో దర్శనమిచ్చే రివ్యూలు, అంచనాలు—అన్నీ నిర్మాతలు నడిపే ఆటలో భాగమే అని అన్నారు. “మాకు నచ్చే వాళ్లు పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. నచ్చని వాళ్లు నెగిటివ్ రివ్యూలు ఇస్తారు. ఇది ఒక మేనేజ్డ్ ప్రపంచం. ఆడియెన్స్ వీటిని చూసి మోసపోవొద్దు,” అని సూచించారు.
“ఈ వ్యవహారాల్లో హీరోలు పాలుపంచుకోరు. ఫ్యాన్స్ మోజు కోసమే డబ్బులిచ్చి వీటిని కొంటున్నాం. వాళ్లకు తమ హీరో సినిమానే గ్రేట్ అనిపించాలి. కానీ నిజం చెప్పాలంటే, ఇవన్నీ మార్కెటింగ్ గిమిక్స్ మాత్రమే,” అని నాగవంశీ బేషరతుగా అన్నారు.
ఈ వ్యాఖ్యలతో నిర్మాత నాగవంశీ టాలీవుడ్ మార్కెటింగ్ మాయాజాలానికి తెర తీసినట్టే అయ్యారు. “మా హీరో మాస్, బాస్, పీక్స్” అనే అభిమానుల నినాదాల వెనుక డబ్బు నింపిన గణాంకాల నిజం బయటపడింది. ఇక మీదట ప్రేక్షకులు, ఫ్యాన్స్ నిజమైన టాలెంట్కి విలువ ఇస్తారా? లేక ఈ ఫేక్ హైప్ గేమ్కి మరింత బలవుతారా అన్నది వేచి చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…