విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా అభ్యర్థులకు శుభవార్త. విదేశాల్లో, ముఖ్యంగా జర్మనీలో ఉద్యోగం పొందాలని కలలుకంటున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వృత్తిపరమైన శిక్షణ అందించి, జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు కల్పించనున్నట్లు విజయనగరం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం. అన్నపూర్ణమ్మ తెలిపారు.
ఈ కార్యక్రమం కింద షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) మహిళా యువతకు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. జర్మనీలో ఉద్యోగం చేయడానికి అవసరమైన జర్మన్ భాషలో 8 నుండి 10 నెలలపాటు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకు రూ.2 లక్షల వరకు జీతం అందిస్తారు.
ఈ అవకాశాన్ని పొందాలనుకునే అర్హులైన మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఎంపిక మూడు విభాగాల్లో జరుగుతుంది:
ఉద్యోగాలు జర్మనీలోనే ఉండటంతో, శిక్షణలో జర్మన్ భాష ప్రావీణ్యం తప్పనిసరి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికార యంత్రాంగం సూచించింది.
ఈ కార్యక్రమం ద్వారా మహిళలు విదేశాల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందే అవకాశం లభించడంతో పాటు, భవిష్యత్ కెరీర్కి కూడా ఇది గొప్ప బాటలు వేస్తుందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…