Is the government harassing you? Complain on this app.. I will not leave anyone: YS Jagan
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిజిటల్ ఉద్యమానికి తెరలేపనున్నట్లు ప్రకటించారు. ప్రజలపై అన్యాయం జరిగితే, ప్రభుత్వ వేధింపులు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేసేందుకు ఓ ప్రత్యేక యాప్ను పార్టీ తరఫున విడుదల చేయనున్నట్లు తెలిపారు.
జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రజలకు అన్యాయం జరిగినా, తప్పు జరిగినా.. వెంటనే ఆ యాప్లో ఫిర్యాదు నమోదు చేయండి. ఎవరి వల్ల ఇబ్బంది కలిగిందో, ఏ అధికారి అన్యాయం చేశాడో వివరాలు ఇవ్వండి. ఆ ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలు, వీడియోలు, పత్రాలు కూడా యాప్లో అప్లోడ్ చేయండి. ఈ ఫిర్యాదులు ఆటోమేటిగ్గా మన డిజిటల్ సర్వర్కి చేరతాయి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై పరిశీలన జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
ఇక ఈ ప్రక్రియలో ఎలాంటి అన్యాయం జరిగినా నిర్లక్ష్యం చేయబోమని హెచ్చరించారు. “మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తప్పుచేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం” అని జగన్ మరోసారి స్పష్టం చేశారు.
జగన్ వ్యాఖ్యలతో పాటు, ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో రెడ్బుక్ వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ రెడ్బుక్ తీసుకొచ్చి, “తప్పు చేసిన వారిని వదిలేది లేదు” అని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టే కేసులన్నీ కూడా రెడ్బుక్ ప్రకారమే జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రకటించిన ఈ యాప్, రెడ్బుక్ వివాదానికి మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది.
జగన్ ప్రకటించిన ఈ యాప్ ద్వారా రాష్ట్ర ప్రజలు నేరుగా తమ సమస్యలను, అన్యాయాలను డాక్యుమెంట్స్ సహా నమోదు చేయగలరు. ఫిర్యాదులు నేరుగా డిజిటల్ సర్వర్కి చేరుతాయి. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ యాప్ లాంచ్తో, వైసీపీ భవిష్యత్తు రాజకీయ వ్యూహాల్లో డిజిటల్ ఫిర్యాదు వ్యవస్థ కీలకంగా మారనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రజలతో నేరుగా అనుసంధానం కావడానికి, ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతను కూడగట్టడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…