మనిషి శరీరంలో 80 శాతం నీరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మన శరీరంలోని అవయవాలు, కణాలు సరిగా పని చేయాలి అంటే సరైన మోతాదులో నీటిని తీసుకోవడం ఎంతో అవసరం. అందుకే చాలామంది నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కొంత మంది రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగుతూ ఉంటారు. అయితే నీటిని తక్కువ తీసుకున్నా అనేక సమస్యలు ఎదురవుతాయి. అదేవిధంగా నీటిని ఎక్కువగా తీసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే మనలో చాలామంది దాహం లేకుండా కూడా నీళ్లు తాగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం…
మధుమేహం : ప్రస్తుత జనరేషన్ లో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి మధుమేహం. దీనికి గల ముఖ్య కారణం రక్తంలో చక్కెర శాతం పెరగడం. అందువల్ల ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. అదేవిధంగా శరీరంలో సరిపడా నీరు లేకపోతే కూడా మూత్రపిండాలు సరిగా పని చేయవు.
అజీర్ణం : మనం ఎక్కువగా కారం ఉన్న పదార్థాలను తినడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు కావాలి. ఈ క్రమంలోనే నీటి కొరత ఏర్పడి అధిక దాహానికి కారణమవుతుంది.
విపరీతంగా చెమటలు : శరీరం నుంచి ఎక్కువగా చెమట విడుదల ఉన్నప్పుడు శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితులోనే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి శరీరం ఎక్కువ నీటిని కోరుతుంది.
ఆందోళన : ఈ ఆందోళన కారణంగా నోరు ఎండిపోవడమే కాకుండా వ్యక్తి ఎక్కువగా నీరు కూడా తాగుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులలో కొన్ని ఎంజైములు నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం మొత్తాన్ని కూడా తగ్గిస్తాయి. అధికంగా దాహం వేస్తుంది .
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…