పద్మశ్రీ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి పేరు వినగానే గొప్ప సినీ గేయ రచయిత మన కళ్ళ ముందు కనిపిస్తారు. ‘సిరివెన్నెల’ చిత్రంలోని పాటలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన అదే సినిమా పేరును తన ఇంటిపేరుగా మార్పుకున్న సీతారామ శాస్త్రి కలం సుంచి ఎన్నో మరెన్నో అద్భుతమైన పాటలు పుట్టుకొచ్చాయి. ఆయన కలం నుండి జాలువారిన ఏ ఒక్క పాట విన్నా చాలు అందులోని సాహిత్యాన్ని బట్టి అది ఖచ్చితంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గా సాహిత్యమేనని చెప్పేయొచ్చు.
టాలీవుడ్ లో మంచి సినీ గేయ రచయితగా పేరు ప్రఖ్యాతలు గడిపిన సీతారామశాస్త్రి ఆమధ్య ‘గాయం’ చిత్రంలో ఓ విలేకరి పాత్రలో వెండితెరపై తళుక్కున మెరిశారు. లేటెస్ట్ గా మళ్ళీ ఇన్నాళ్ళకు ఆయన వారసత్వాన్ని అందిపుచ్ఛుకున్న ఆయన కొడుకు రాజా కూడా వెండితెరపై నటుడిగా తన ప్రతిభను చూపిస్తున్నాడు. అసలు రాజాని చూస్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి కొడుకు అని ఎవరూ గుర్తించలేరు కూడా.! ఎందుకంటే.. ఎక్కడా కూడా తన తండ్రి పేరును వాడుకోకుండా తనదైన నటనా ప్రతిభతో సినిమా రంగంలో వైవిధ్యమైన పాత్రలతో అందరినీ అలరిస్తున్నాడు. ఇతని పూర్తి పేరు చెంబోలు రాజా. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజా..
ఇంతవరకూ ‘ఫిదా, అంతరిక్షం, ఎవడు, హ్యాపీ వెడ్డింగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, రణరంగం, మిస్టర్ మజ్ను, ఏబీసీడీ’ వంటి ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించాడు. ఏంటీ.. ఇంకా మీరు రాజాని గుర్తు పట్టలేదా.? ‘ఫిదా’ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ కి అన్న పాత్రలో నటించింది.. ‘ఎవడు’ చిత్రంలో రామ్ చరణ్ కి ఫ్రెండ్ గా నటించింది..
ఆతరువాత ‘ABCD’ చిత్రంలో యువజన నాయకుడిగా నటించింది మన రాజాయే.! ఇవే కాకుండా.. ఇంకా ఇద్దరిలోకం ఒక్కటే, అజ్ఞాతవాసి, భానుమతి రామకృష్ణ, వి వంటి చిత్రాలలో కూడా నటించాడు. అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ ‘సవ్వడి’ లో నటించిన రాజా ప్రస్తుతం ‘మస్తీ’ వంటి వెబ్ సీరీస్ లలో కూడా నటించాడు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…