Health News

11 ఏళ్లుగా ఇంట్లోనే నివసిస్తున్నా ఆ యువతిని కనిపెట్టలేకపోయారు!

సాధారణంగా మన కుటుంబంలో వ్యక్తి లేదా మన బంధువులలో ఎవరైనా తప్పి పోతే వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారి కోసం ఇతర ప్రాంతాలలో గాలింపు చర్యలు మొదలు పెడతాము.ఈ విధంగా అనేక చోట్ల వారి గురించి వెతికిన కూడా వారి ఆచూకీ తెలియక పోతే వారు బహుశా మన కంటికి కనిపించనంత దూరంలోకి వెళ్లిపోయారని, లేదా ఏదైనా అఘాయిత్యం చేసుకొని చనిపోయి ఉంటారని భావిస్తాము. కానీ ఓ యువతి ఇంటిలో నుంచి వెళ్లిపోయి పదకొండు సంవత్సరాల పాటు తమ కుటుంబ సభ్యులకు కనిపించకుండా తన ఇంటికి కేవలం అతి దగ్గరలోనే అదే ఊర్లో నివసిస్తున్న కనిపెట్ట లేకపోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకీ ఈ విచిత్రమైన ఘటన జరిగింది మన ఇండియాలోనే. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలోని అయలూర్ గ్రామానికి చెందిన సజిత అనే యువతి 2010లో అకస్మాత్తుగా ఇంటి నుంచి మాయమైంది. సజిత తాను ప్రేమించిన వ్యక్తి అలించువట్టి రెహ్మాన్‌తో కలిసి జీవించేందుకు వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తన కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. సంవత్సరాలు గడుస్తున్నా తన ఆచూకీ తెలియకపోవడంతో తనపై తమ కుటుంబ సభ్యుల ఆశలు వదులుకున్నారు.

కానీ సజిత మాత్రం అదే ఊరిలో తన ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి తన ప్రియుడు రెహ్మాన్‌ ఇంటిలోనే నివసించేది. అయితే ఈ విషయం రెహ్మాన్‌ కుటుంబ సభ్యులకు కూడా తెలియక పోవడం గమనార్హం.రెహ్మాన్‌ ప్రతిరోజు తన గదికి తాళం వేసుకుని వెళ్లేవాడు.ఈ విధంగా గదికి తాళం ఎందుకు వేస్తున్నావ్ అని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా వారిపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఇలా ఎవరికీ తెలియకుండా తన ప్రియురాలు 11 సంవత్సరాలపాటు ఒకే గదిలోనే ఉంచాడు.

తన ప్రియురాలికి బోర్ కొట్టకుండా ఒక చిన్న టీవీని ఏర్పాటు చేసి టీవీ శబ్దం బయటకు రాకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకునేది.రెహ్మాన్‌ గదిలో బాత్రూమ్ సదుపాయం లేకపోయినప్పటికీ రాత్రి సమయంలో అందరూ పడుకున్నప్పుడు ఆమె బాత్రూం వెళ్ళేది. అదేవిధంగా రెహ్మాన్‌ కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు వీరిద్దరు స్వేచ్ఛగా ఇంట్లో తిరిగేవారు. ఇలా 11 సంవత్సరాల పాటు ఒకే గదికే పరిమితమైన సజితకు స్వేచ్ఛ కల్పించాలని వారిద్దరూ కలిసి జీవించడం కోసం వేరే ఊరికి వెళ్ళిపోయారు.

ఈ విధంగా రెహ్మాన్‌ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరోజు అనుకోకుండా రెహ్మాన్‌ సోదరుడు బషీర్‌కు రోడ్డు పక్కన రెహ్మాన్ కనిపించాడు. దీంతో బషీర్ అతడిని అనుసరించాడు. రెహ్మాన్ ఓ అద్దె ఇంట్లో సజితతో కలిసి ఉంటున్నట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టుకు పంపగా కోర్టు వీరిద్దరి పెళ్ళికి నిరాకరించిన అప్పటికీ వీరిరువురు కలిసి ఉండాలని తీర్పునిచ్చింది. చనిపోయిందన్న తమ కూతురు 11 సంవత్సరాల పాటు అదే ఊరిలోనే ఉందని తెలుసుకున్న సజిత కుటుంబ సభ్యులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

3 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

4 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

4 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

6 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

6 hours ago