సాధారణంగా మన కుటుంబంలో వ్యక్తి లేదా మన బంధువులలో ఎవరైనా తప్పి పోతే వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారి కోసం ఇతర ప్రాంతాలలో గాలింపు చర్యలు మొదలు పెడతాము.ఈ విధంగా అనేక చోట్ల వారి గురించి వెతికిన కూడా వారి ఆచూకీ తెలియక పోతే వారు బహుశా మన కంటికి కనిపించనంత దూరంలోకి వెళ్లిపోయారని, లేదా ఏదైనా అఘాయిత్యం చేసుకొని చనిపోయి ఉంటారని భావిస్తాము. కానీ ఓ యువతి ఇంటిలో నుంచి వెళ్లిపోయి పదకొండు సంవత్సరాల పాటు తమ కుటుంబ సభ్యులకు కనిపించకుండా తన ఇంటికి కేవలం అతి దగ్గరలోనే అదే ఊర్లో నివసిస్తున్న కనిపెట్ట లేకపోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకీ ఈ విచిత్రమైన ఘటన జరిగింది మన ఇండియాలోనే. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళలోని అయలూర్ గ్రామానికి చెందిన సజిత అనే యువతి 2010లో అకస్మాత్తుగా ఇంటి నుంచి మాయమైంది. సజిత తాను ప్రేమించిన వ్యక్తి అలించువట్టి రెహ్మాన్తో కలిసి జీవించేందుకు వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తన కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. సంవత్సరాలు గడుస్తున్నా తన ఆచూకీ తెలియకపోవడంతో తనపై తమ కుటుంబ సభ్యుల ఆశలు వదులుకున్నారు.
కానీ సజిత మాత్రం అదే ఊరిలో తన ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి తన ప్రియుడు రెహ్మాన్ ఇంటిలోనే నివసించేది. అయితే ఈ విషయం రెహ్మాన్ కుటుంబ సభ్యులకు కూడా తెలియక పోవడం గమనార్హం.రెహ్మాన్ ప్రతిరోజు తన గదికి తాళం వేసుకుని వెళ్లేవాడు.ఈ విధంగా గదికి తాళం ఎందుకు వేస్తున్నావ్ అని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా వారిపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఇలా ఎవరికీ తెలియకుండా తన ప్రియురాలు 11 సంవత్సరాలపాటు ఒకే గదిలోనే ఉంచాడు.
తన ప్రియురాలికి బోర్ కొట్టకుండా ఒక చిన్న టీవీని ఏర్పాటు చేసి టీవీ శబ్దం బయటకు రాకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకునేది.రెహ్మాన్ గదిలో బాత్రూమ్ సదుపాయం లేకపోయినప్పటికీ రాత్రి సమయంలో అందరూ పడుకున్నప్పుడు ఆమె బాత్రూం వెళ్ళేది. అదేవిధంగా రెహ్మాన్ కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు వీరిద్దరు స్వేచ్ఛగా ఇంట్లో తిరిగేవారు. ఇలా 11 సంవత్సరాల పాటు ఒకే గదికే పరిమితమైన సజితకు స్వేచ్ఛ కల్పించాలని వారిద్దరూ కలిసి జీవించడం కోసం వేరే ఊరికి వెళ్ళిపోయారు.
ఈ విధంగా రెహ్మాన్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరోజు అనుకోకుండా రెహ్మాన్ సోదరుడు బషీర్కు రోడ్డు పక్కన రెహ్మాన్ కనిపించాడు. దీంతో బషీర్ అతడిని అనుసరించాడు. రెహ్మాన్ ఓ అద్దె ఇంట్లో సజితతో కలిసి ఉంటున్నట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టుకు పంపగా కోర్టు వీరిద్దరి పెళ్ళికి నిరాకరించిన అప్పటికీ వీరిరువురు కలిసి ఉండాలని తీర్పునిచ్చింది. చనిపోయిందన్న తమ కూతురు 11 సంవత్సరాల పాటు అదే ఊరిలోనే ఉందని తెలుసుకున్న సజిత కుటుంబ సభ్యులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…