Fuel Price Hike : దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ధరలపెంపుకు ఒకరోజు గ్యాప్ ఇచ్చిన చమురు కంపెనీలు ఈరోజు మరోసారి పెట్రోల్, డీజిల్పై లీటరుకు 80 పైసలు పెంచేశారు. దీనితో గత నాలుగు రోజులలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం ఇది మూడోసారి.
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. తెలంగాణ హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై రూ. 90 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోలు ధర రూ.111.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.76కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.98.74కు చేరుకుంది.
ఇక తాజా పెంపుతో నాలుగు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిలు ధరలు రూ.2.40 చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు భారీగా పెరిగడంతో చమురు కంపెనీలు లీటరు డీజిలుపై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోలుపై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు ఇలా ప్రతిరోజూ వడ్డించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…