Fuel Price Hike : దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ధరలపెంపుకు ఒకరోజు గ్యాప్ ఇచ్చిన చమురు కంపెనీలు ఈరోజు మరోసారి పెట్రోల్, డీజిల్పై లీటరుకు 80 పైసలు పెంచేశారు. దీనితో గత నాలుగు రోజులలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం ఇది మూడోసారి.

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. తెలంగాణ హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై రూ. 90 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోలు ధర రూ.111.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.76కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.98.74కు చేరుకుంది.
ఇక తాజా పెంపుతో నాలుగు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిలు ధరలు రూ.2.40 చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు భారీగా పెరిగడంతో చమురు కంపెనీలు లీటరు డీజిలుపై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోలుపై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు ఇలా ప్రతిరోజూ వడ్డించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.































