G. Nageswar reddy : ‘6 టీన్స్’ తో డైరెక్టర్ గా మొదలయిన నాగేశ్వరెడ్డి కామెడీ ప్రధాన సినిమాలను ఎక్కువగా తీశారు. సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ, కరెంటు తీగ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన జీ నాగేశ్వరెడ్డి గారు తాజాగా ‘జిన్నా’ సినిమాకు కథను అందించారు. మంచు కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న నాగేశ్వరెడ్డి గారు మంచు విష్ణు తో రెండు, మంచు మనోజ్ తో ఒక సినిమా తీశారు. ఇక జిన్నా సినిమాకు దర్శకత్వం ఎందుకు చేయలేదు, సినిమా ఎందుకు హిట్ కాలేదు అనే విషయాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సినిమా ఫ్లాప్ అవడానికి వాళ్ళే కారణం…
జిన్నా సినిమాకు జీ నాగేశ్వరెడ్డి గారు కథను అందించారు. దర్శకత్వం ఆయన వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల తప్పుకున్నారు. అయితే సినిమా కథ, నటీ నటుల ఎంపిక మొత్తం ఆయనే చూసుకున్నారు. ఇక డైరెక్షన్ సూర్య చేసారు. కోన వెంకట్ ఈ సినిమాకు పనిచేసారు, అలాగే సినిమాకు ఫైనాన్స్ కూడా చేయడం వల్ల మరింత జాగర్తలు తీసుకున్నారు అంటూ చెప్పారు. సినిమా మొత్తం షూటింగ్ అయ్యాక సినిమా విష్ణు తో కలిసి చూసాను, చాలా బాగా వచ్చిందని అనుకున్నాం. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది రిలీజ్ అయ్యాక. కానీ సినిమాకు కలెక్షన్స్ రాలేదు నష్టం వచ్చింది.
మంచు ఫ్యామిలీ మీద చేసే విపరీతమైన ట్రోల్స్ దీనికి కారణం. ట్రోలర్స్ మరీ వ్యక్తిగతంగా ట్రోల్స్ చేయడం సినిమా చూడకండి అనే రేంజ్ కి ప్రచారం చేయడం వల్ల జనాలకు మంచు ఫ్యామిలీ మీద నెగెటివ్ ఒపీనియన్ పడింది. అందువల్లే సినిమా ఆడలేదు. 90% ట్రోల్లర్స్ ఈ సినిమా పోవడానికి కారణమని నా అభిప్రాయం అంటూ నాగేశ్వరెడ్డి గారు అభిప్రాయాపడ్డారు. ఇక సినిమా కు బాగా నష్టం వచ్చిందని చెబుతూ ఓటిటిలో విడుదల అయ్యాక సినిమా జనాలు చూస్తారని అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…