Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు.
ఇటీవల ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం లక్నోలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప2 సినిమా ట్రైలర్ పాట్నాలో జరగడంతో ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి అభిమానులు తరలి వచ్చారు. ఇది చూసిన గేమ్ ఛేంజర్ మేకర్స్ ఏకంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అమెరికాలో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ ఉంది అయితే ఈ ట్యాగ్ ఉపయోగించుకొని అమెరికాలో ఈ సినిమా వేడుకను నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. ఇలా ఇతర దేశాలలో ఈ సినిమా వేడుకను నిర్వహిస్తే పెద్దగా బజ్ రాకపోవచ్చు అని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటివరకు ప్రేక్షకులలో ఏమాత్రం హైప్ లేదని చెప్పాలి.
సంక్రాంతికి ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో కలెక్షన్ల వరకు పరవాలేదు కానీ రికార్డులు సాధించాలి అంటే సినిమాపై మంచి హైప్ ఉండాలి. ఇలాంటి తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహించకుండా విదేశాలలో ఈ సినిమా వేడుకలను నిర్వహిస్తే ఖచ్చితంగా సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.యూఎస్ఏలో ఓ తెలుగు మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. డిసెంబర్ 21న గార్లాండ్లోని కుర్తీస్ కుల్వెల్ సెంటర్లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ నిర్ణయం ఎంతవరకూ కరెక్ట్ అనేది చాలా మంది సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…