భారతదేశంలో వండే వంటకాల్లో ముఖ్యంగా గరం మసాలా అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో ఎక్కువగా లవంగం, సోపు, మిరియాలు, కొత్తిమీర, యాలకులు, జీలకర్ర, దాల్చినచెక్క, మెంతులు, ఆవాలు లాంటి సుగంధ ద్రవ్యాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. భయట దాకాణాల్లో దొరికే గరం మసాలా కంటే ఇంట్లో చేసుకునే గరం మసాలా ఎక్కువ రుచిగా ఉంటాయి.
వెజ్ వంట అయినా.. నాన్ వెజ్ వంట అయినా ఘుమఘుమలాడాలంటే అందులో గరం మాసాలా అనేది వేయాల్సిందే. వీటిలో ఎక్కువగా ఖనిజ లవణాలు, పోషకాలు కూడా ఉంటాయి. గరం మసాలా వాడటం వల్ల మనం పొందే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా శరీర ఉష్ట్రోగ్రతను పెంచడంతో పాటు తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎంతో దొహదపడుతుంది. ఎసిటిటీని కూడా దూరంగా ఉంచుతుంది. శరీరంలో పేర్కొన్న చెడ్డ కొలెస్టరాల్ స్థాయిలను తగ్గంచడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మలబద్దకం ఉన్న వాళ్లు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
మలబద్దకాన్ని పూర్తిగా నివారిస్తుంది. గరం మసాలాని తీసుకోవటం వల్ల సమర్థవంతమైన జీర్ణక్రియకు దారి తీస్తుంది దీంతో అంతిమంగా శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగించడానికి దారితీస్తుంది. ఈ మసాలా దినుసుల్లో ఉండే పోషకాలు కేలరీలను కరిగించి.. బరువును తగ్గించడంలో సాయపడతాయి. అందుకే గరం మసాలాను ఆహారంలో చేర్చి ఎక్కువ కేలరీలను బర్న్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా.. గుండె సంబంధిత వ్యాధులు, ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధుల బారి నుంచి రక్షించబడుతుంది.
డయాబెటిస్ రాకుండా కూడా పోరాడుతుంది. శరీరంలో ఎక్కడైనా వాపు ఏర్పడితే దానిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను తగ్గించి.. దంతాలను మెరిసే విధంగా చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని నివారించడంతో పాటు.. వయస్సు కారణంగా వచ్చే వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు గరంమసాలాలో ఉండే మిరియాలు మరియు జీలకర్ర ఉపయోగపడతాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…