భారతదేశంలో వండే వంటకాల్లో ముఖ్యంగా గరం మసాలా అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో ఎక్కువగా లవంగం, సోపు, మిరియాలు, కొత్తిమీర, యాలకులు, జీలకర్ర, దాల్చినచెక్క, మెంతులు, ఆవాలు లాంటి సుగంధ ద్రవ్యాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. భయట దాకాణాల్లో దొరికే గరం మసాలా కంటే ఇంట్లో చేసుకునే గరం మసాలా ఎక్కువ రుచిగా ఉంటాయి.

వెజ్ వంట అయినా.. నాన్ వెజ్ వంట అయినా ఘుమఘుమలాడాలంటే అందులో గరం మాసాలా అనేది వేయాల్సిందే. వీటిలో ఎక్కువగా ఖనిజ లవణాలు, పోషకాలు కూడా ఉంటాయి. గరం మసాలా వాడటం వల్ల మనం పొందే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా శరీర ఉష్ట్రోగ్రతను పెంచడంతో పాటు తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎంతో దొహదపడుతుంది. ఎసిటిటీని కూడా దూరంగా ఉంచుతుంది. శరీరంలో పేర్కొన్న చెడ్డ కొలెస్టరాల్ స్థాయిలను తగ్గంచడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మలబద్దకం ఉన్న వాళ్లు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
మలబద్దకాన్ని పూర్తిగా నివారిస్తుంది. గరం మసాలాని తీసుకోవటం వల్ల సమర్థవంతమైన జీర్ణక్రియకు దారి తీస్తుంది దీంతో అంతిమంగా శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగించడానికి దారితీస్తుంది. ఈ మసాలా దినుసుల్లో ఉండే పోషకాలు కేలరీలను కరిగించి.. బరువును తగ్గించడంలో సాయపడతాయి. అందుకే గరం మసాలాను ఆహారంలో చేర్చి ఎక్కువ కేలరీలను బర్న్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా.. గుండె సంబంధిత వ్యాధులు, ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధుల బారి నుంచి రక్షించబడుతుంది.
డయాబెటిస్ రాకుండా కూడా పోరాడుతుంది. శరీరంలో ఎక్కడైనా వాపు ఏర్పడితే దానిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను తగ్గించి.. దంతాలను మెరిసే విధంగా చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని నివారించడంతో పాటు.. వయస్సు కారణంగా వచ్చే వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు గరంమసాలాలో ఉండే మిరియాలు మరియు జీలకర్ర ఉపయోగపడతాయి.































