Featured

సామాన్యులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు..?

చమురు కంపెనీలు సామాన్యులకు భారీ షాక్ ఇచ్చాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 50 రూపాయలు పెంచాయి. ఇప్పటికే నిత్యావసర ధరల పెంపు, పెట్రోల్ ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు గ్యాస్ సిలిండర్ ధరల పెంపు రూపంలో మరో పిడుగు పడింది. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు గురించి సామాన్యుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

దేశీయ చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 594 రూపాయల నుంచి 644 రూపాయలకు పెరిగింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండగా సిలిండర్ ధరలను చమురు కంపెనీలు పెంచడం గమనార్హం.

ఇప్పటికే నూనెల నుంచి బియ్యం వరకు గత కొన్ని రోజులుగా అన్ని వస్తువుల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల సామాన్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రైవేట్ కంపెనీలు వేతనాల్లో భారీగా కోత విధించాయి. ఇలాంటి సమయంలో గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్యులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి.

ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో విధంగా ఉండటం వల్ల రాష్ట్రాన్ని బట్టి గ్యాస్ సిలిండర్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. హైదరబాద్ లో సిలిండర్‌ ధర రూ.646.50 ఉండగా తాజాగా పెరిగిన ధరలతో గ్యాస్ సిలిండర్ ధర రూ.696.50కు చేరడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

10 hours ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

11 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

12 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

12 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

12 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

12 hours ago