Geethu Royal: బిగ్ బాస్ కార్యక్రమం 9వ వారం ఎంతో భావోద్వేగాల నడుమ ముగిసింది.9వ వారం ఎలిమినేషన్ లో భాగంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడంతో ఒక్కసారిగా అభిమానులతో పాటు కంటెస్టెంట్ గీతూ షాక్ కి గురయింది.ఈవారం ఎలిమినేషన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరిని నాగార్జున ఒక్కొక్కసారి సేవ్ చేస్తూ ఉండగా చివరికి శ్రీ సత్య గీతూ మిగిలిపోయారు.
ఇక ఈవారం తానే ఎలిమినేట్ అయ్యేది తానే అంటూ శ్రీ సత్య ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోగా ఒక్కసారి బిగ్ బాస్ శ్రీ సత్యను సేవ్ చేస్తూ హౌస్ నుంచి గీతూను ఎలిమినేట్ చేశారు.ఇలా ఈమె ఎలిమినేట్ అయిందని తెలియగానే హౌస్ లో ఉన్నటువంటి రేవంత్ ఆది శ్రీ సత్య ఫైమా ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.తాను బిగ్ బాస్ హౌస్ విడిచి వెళ్ళనని దయచేసి తనను పంపించకండి అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక హౌస్ లో తన ఫేవరెట్ ప్లేస్ కు వెళ్లి కాసేపు కూర్చొని ఎంతో ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్ హౌస్ వీడి బయటకు వచ్చారు.బయటకు వచ్చినటువంటి ఆమె తన జర్నీ చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడ్చడంతో నాగార్జున సైతం ఆమెను ఓదార్చలేక చూస్తూ ఉండిపోయారు. 24 గంటలు తాను బిగ్ బాస్ టైటిల్ కోసమే కష్టపడ్డానని, ప్రతిక్షణం తన ఆట తీరును కనబరిస్తూ గెలుపు కోసం కష్టపడిన తనని ఇంత తొందరగా బయటకు పంపిస్తున్నారనీ ఏడ్చారు.
దయచేసి నన్ను బయటకు పంపించకండి అంటూ ఏర్పడమే కాకుండా ఐ లవ్ యు బిగ్ బాస్ మీకు రుణపడి ఉంటా అంటూ గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చారు. ఇక ఈమె ఎలిమినేట్ కావడంతో ఆది రేవంత్ సైతం ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆది గురించి గీతూ మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ ఆదిరెడ్డి అంటూ ఈమె ఆదిరెడ్డి గురించి చెప్పుకొచ్చారు. ఆదిరెడ్డి, ఫైమా, శ్రీ సత్య, రేవంత్, శ్రీహాన్ టాప్ ఫైవ్ లో ఉంటారంటూ ఈమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ల గురించి కూడా చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…