Geetu Royal: బిగ్ బాస్ రివ్యూల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యి ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు నటి గీతూ రాయాల్. ప్రస్తుతం ఈమె రివ్యూల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని జబర్దస్త్ కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఈమెకు పాల్గొనే అవకాశం వచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. తనని చాలామంది చిన్నప్పటినుంచి బాడీ షేమింగ్ చేస్తున్నారని, ఇలా తన బాడీ గురించి మాట్లాడటంతో ఇతరులకు ఛాన్స్ ఇవ్వకుండా తను నిండుగా దుస్తులను దరిస్తున్నానని ఈమె తెలిపారు. అయితే నా స్నేహితులు కజిన్స్ ఇతర మాటలను పట్టించుకోకుండా నీ శరీరాన్ని నువ్వు ప్రేమించు అని చెప్పినట్లు ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
ఇలా తనని చాలామంది బాడీ షేమింగ్ చేయడం ఎంతో బాధగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈ వీడియో పై షణ్ముఖ జశ్వంత్ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. గత సీజన్ లో షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో నువ్వు అతనిని బాడీ షేమింగ్ చేయలేదా అంటూ పెద్ద ఎత్తున ఈమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే తాను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మాత్రమే తన గురించి మాట్లాడానని అక్కడ ఆ కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ ఇవ్వడమే తన పని అంటూ సమాధానం చెప్పారు.
ఆయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను ఒక మాట కూడా అనలేదని, అలాంటి అవసరం నాకు లేదని ఈమె తెలిపారు. అయితే నా బాధ ఇలా బయటకు చెప్పడంతో చాలామంది నన్ను సింపతి కోసమే ఇలా చేస్తున్నానని అంటున్నారు. ఇలా సింపతి కోసం చేయాల్సిన అవసరం తనకు ఏ మాత్రం లేదని, తనకు ఎంతో టాలెంట్ ఉందని ఈమె ఘాటుగా సమాధానం చెప్పారు. ఇకపోతే తాను ఎవరినైనా బాడీ షేమింగ్ చేస్తున్నట్లు కనుక వీడియోలు ఉంటే వాటిని తనకు పంపించాలని అదే కనుక నిజమైతే తాను బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి కూడా ఏమాత్రం వెనకాడనని గీతూ రాయల్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…