Geetu Royal: బిగ్ బాస్ రివ్యూల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యి ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు నటి గీతూ రాయాల్. ప్రస్తుతం ఈమె రివ్యూల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని జబర్దస్త్ కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఈమెకు పాల్గొనే అవకాశం వచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. తనని చాలామంది చిన్నప్పటినుంచి బాడీ షేమింగ్ చేస్తున్నారని, ఇలా తన బాడీ గురించి మాట్లాడటంతో ఇతరులకు ఛాన్స్ ఇవ్వకుండా తను నిండుగా దుస్తులను దరిస్తున్నానని ఈమె తెలిపారు. అయితే నా స్నేహితులు కజిన్స్ ఇతర మాటలను పట్టించుకోకుండా నీ శరీరాన్ని నువ్వు ప్రేమించు అని చెప్పినట్లు ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
ఇలా తనని చాలామంది బాడీ షేమింగ్ చేయడం ఎంతో బాధగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈ వీడియో పై షణ్ముఖ జశ్వంత్ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. గత సీజన్ లో షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో నువ్వు అతనిని బాడీ షేమింగ్ చేయలేదా అంటూ పెద్ద ఎత్తున ఈమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే తాను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మాత్రమే తన గురించి మాట్లాడానని అక్కడ ఆ కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ ఇవ్వడమే తన పని అంటూ సమాధానం చెప్పారు.
ఆయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను ఒక మాట కూడా అనలేదని, అలాంటి అవసరం నాకు లేదని ఈమె తెలిపారు. అయితే నా బాధ ఇలా బయటకు చెప్పడంతో చాలామంది నన్ను సింపతి కోసమే ఇలా చేస్తున్నానని అంటున్నారు. ఇలా సింపతి కోసం చేయాల్సిన అవసరం తనకు ఏ మాత్రం లేదని, తనకు ఎంతో టాలెంట్ ఉందని ఈమె ఘాటుగా సమాధానం చెప్పారు. ఇకపోతే తాను ఎవరినైనా బాడీ షేమింగ్ చేస్తున్నట్లు కనుక వీడియోలు ఉంటే వాటిని తనకు పంపించాలని అదే కనుక నిజమైతే తాను బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి కూడా ఏమాత్రం వెనకాడనని గీతూ రాయల్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…