2019 లో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను సీఎం అయిన తర్వాత మద్యపానాన్ని విడతల వారీగా నిషేదిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2019 లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని.. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సీట్లతో అతడు తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వచ్చాడు.
మద్యం విషయంలో కూడా నిషేదాన్ని విడతల వారీగా అమలు పరుచుకుంటూ వచ్చాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ సంవత్సరం మద్యం దుకాణాలను తగ్గించడం లేదంటూ.. మద్యం ప్రియులకు శుభవార్త చెప్పాడు. అంతక ముందు ఉన్న మద్యం దుకాణాలనే పొడిగిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కొంతమంది ఖుషీగా ఫీల్ అవుతుంటే మరికొంత మంది దీని వెనకాల ఏదో జరుగుతుందంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం కూడా అవే ధరలు కొనసాగనున్నట్లు సమాచారం. మీడియం, ప్రీమియం బ్రాండ్ ధరలను సుమారు 25 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. బీరు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కూడా మద్యం దుకాణాలను తగ్గించడం లేదు కావునా.. ధరలు కూడా అలానే ఉంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…