కరోనా మహమ్మారి వ్యాధి ప్రజలపై విరుచుకుపడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణించారు. అందులో కొంతమంది వ్యాధి సోకిన వారిలో కొన్నిసమస్యల కారణంగా బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా.. వ్యాధి నిరోధక శక్తి ఉన్న వాళ్లు కరోనాతో పోరాడి.. ప్రాణాలను కాపాడుకోగలిగారు.
ప్రతీ మనిషికి ఇమ్యూనిటీ పవర్ ఉండాలని.. వైద్యులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. వినే వాళ్లు విన్నారు.. వినని వాళ్లు వినలేదు. మంచి ఆరోగ్యం కోసం పోషకాలు కలిగిన పదర్ధాలను కూడా తీసుకోవాలని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్తితుల్లో ఆ ఇమ్యూనిటీ పవర్ కోసమే చాలామంది ప్రయత్నిస్తున్నారు.
దాని కోసం వివిధ రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్ ను తింటున్నారు. అయితే పండ్లలో మనం ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెంచుకోవాలంటూ జామ పండు అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. నారింజలో ఉండే విటమిన్–సి కంటే కూడా జామలో ఉండే విటమిన్–సి ఎక్కువగా ఉంటుంది.
అందుకే జామపండు ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా ఉపయోగిస్తారు. విటమిన్ సి అంటేనే వ్యాధి నిరోదక శక్తి ఎక్కువగా ఉండేది. జామలో దానితో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీని ద్వారా మలబద్దకం కూడా తేలికగా నివారించవచ్చు. ఇలాంటి ఎన్నో గుణాలు ఉన్న జామను ఎక్కువగా చాలామంది ఇష్టపడుతుంటారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…