రైతులకు ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల పథకాలను ప్రవేశపెడుతూ.. వారికి భరోసాగా నిలుస్తోంది. పీఎం కిసాన్ తో పంటలకు పెట్టుబడి కింద సంవత్సరానికి రూ. 6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ ఆర్థిక సాయం రైతులకు ఎంతో మేలు చేకూర్చుతుంది. అయితే తాజాగా మోడీ సర్కారు మరో శుభవార్త చెప్పింది. అదేంటంటే.. రబీ పంటలకు కనీస మద్దతును పెంచుతూ.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
రబీ సీజన్లో పంటలు వేసే రైతులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వేర్వేరు పంటలకు కనీసం రూ. 40 నుంచి రూ. 400 వరకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రి మండలి బుధవారం సమావేశమైంది.
ఈ సందర్బంగా దేశంలో 2022-23 మార్కెటింగ్ సీజన్లో అధీకృత రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర ను పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఇందులో గోధుమలకు క్వింటాల్ కు 1,975 నుంచి 2015గా.. బార్లీకి 2021-22 లో రబీ మార్కెట్ సీజన్లో కనీస మద్దతు ధర రూ.1,600 ఉండగా.. తాజాగా దానిని రూ.1,635 గా ప్రకటించింది.
శనగలకు రూ.5,100 నుంచి 5,230 వరకు.. ఎర్ర పప్పు రూ.5,100 నుంచి రూ.5,500 గా ప్రకటించింది ప్రభుత్వం. ఆవాలకు రూ.4,650 నుంచి రూ.5,050 గా.. కుసుమలకు రూ.5,327 నుంచి సీజన్కు కనీస మద్దతు ధర రూ.5,441 గా ప్రకటించింది ప్రభుత్వం. రైతుల్లో ఇతర పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…