వివాహేతర సంబంధాల వల్ల కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. వారిపైనే ఆధారపడి జీవిస్తున్న పిల్లలు, కుబుంబసభ్యులను అనాథలను చేసి ఈ లోకాన్ని విడిచి పోతున్నారు. క్షణికావేశంలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. పక్కింటి మహిళ లేదా పురుషుడి వ్యామోహంలో పడి కట్టుకున్న భాగస్వామికి ద్రోహం చేసి.. ఈ సమాజానికి తలవంపు తెస్తున్నారు.
ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హోసంగాబాద్ పట్టణంలో కణ్హే గ్రామంలో పింకీ మరియు ఆమె భర్త నివసిస్తున్నారు. అందులో భర్త రోజూ ఓ మహిళతో మాట్లాడుతుండటం భార్య గమనించింది. ఇలా తన భర్తతో పక్కింటి మహిళ సంగీతతో మాట్లాడటాన్ని చూసి ఆమె తట్టుకోలేక పోయింది.
ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం పెంచుకుంది. ఆ అనుమానంతోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకునేది. రోజూ ఏదో చిన్న చిన్న గొడవలు పెట్టుకునే వారు. దీంతో ఆమె ఓ రోజు దారుణానికి ఒడిగట్టింది. ఓ రోజు సంగీత ఆమె ఇద్దరు పిల్లలతో ఆమె కూరగాయల మార్కెట్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అది గమనించిన పింకీ .. తన భర్తతో ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ నిలదీసింది.
దీంతో గొడవ మళ్లీ మొదలైంది. ఆ గొడవలో ఆమె పక్కనే ఉన్న ఓ బావిలో ఆ ఇద్దరు చిన్నారులనే తోసి.. సంగీతను కూడా అందులో పడేసింది. దీంతో ఆమె అక్కడ నుంచి పారిపోయింది. స్థానికుల సమచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఆమె కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…