వివాహేతర సంబంధాల వల్ల కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. వారిపైనే ఆధారపడి జీవిస్తున్న పిల్లలు, కుబుంబసభ్యులను అనాథలను చేసి ఈ లోకాన్ని విడిచి పోతున్నారు. క్షణికావేశంలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. పక్కింటి మహిళ లేదా పురుషుడి వ్యామోహంలో పడి కట్టుకున్న భాగస్వామికి ద్రోహం చేసి.. ఈ సమాజానికి తలవంపు తెస్తున్నారు.
ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హోసంగాబాద్ పట్టణంలో కణ్హే గ్రామంలో పింకీ మరియు ఆమె భర్త నివసిస్తున్నారు. అందులో భర్త రోజూ ఓ మహిళతో మాట్లాడుతుండటం భార్య గమనించింది. ఇలా తన భర్తతో పక్కింటి మహిళ సంగీతతో మాట్లాడటాన్ని చూసి ఆమె తట్టుకోలేక పోయింది.
ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం పెంచుకుంది. ఆ అనుమానంతోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకునేది. రోజూ ఏదో చిన్న చిన్న గొడవలు పెట్టుకునే వారు. దీంతో ఆమె ఓ రోజు దారుణానికి ఒడిగట్టింది. ఓ రోజు సంగీత ఆమె ఇద్దరు పిల్లలతో ఆమె కూరగాయల మార్కెట్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అది గమనించిన పింకీ .. తన భర్తతో ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ నిలదీసింది.
దీంతో గొడవ మళ్లీ మొదలైంది. ఆ గొడవలో ఆమె పక్కనే ఉన్న ఓ బావిలో ఆ ఇద్దరు చిన్నారులనే తోసి.. సంగీతను కూడా అందులో పడేసింది. దీంతో ఆమె అక్కడ నుంచి పారిపోయింది. స్థానికుల సమచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఆమె కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…