ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్న మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచంలో విలతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే తేరుకుని దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెల్సిందే… ఈ సమయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది సామాన్య ప్రజలు మాత్రమే. అయితే ఈ క్రమంలో మహిళలకు ఆర్ధిక సహాయం అందించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. “పీఎం గరీబ్ కళ్యాణ్” ప్యాకేజి కింద ప్రధాన మంత్రి జన్ ధన్ అకౌంట్స్ ఉన్న మహిళలు అందరికి రూ. 500 చొప్పున జమచేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ ఆర్ధిక సహాయం చేయనుంది.
ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ జన్ ధన్ అకౌంట్లలో డబ్బులు వేయనున్నారు. అకౌంట్స్ లో నగదు క్రెడిట్ అయిన తరువాత రూపే డెబిట్ కార్డు ను ఉపయోగించి ఆ డబ్బును ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కొందరు మహిళల కెవైసి పత్రాలు లేవన్న నెపంతో చిన్న చిన్న అకౌంట్లను స్తంభిపచేయొద్దని సూచించింది. ఇప్పటికే డీయాక్టివేట్ చేసిన అకౌంట్లను వెంటనే యాక్టివేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ అకౌంట్స్ ఉన్న మహిళలు తమ ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…