కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. మన దేశంలో కూడా అనూహ్యంగా పాజిటివ్ కేసులు పెరుగుతూన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడంకోసం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు రోడ్ల మీదికి రావొద్దని ఆంక్షలు విధించారు. ఈ లాక్ డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. అయినా కూడా కొంత మంది ఏమి పట్టనట్టు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎదో ఒక వంకతో బయట తిరుగుతూనే ఉన్నారు.. కొందరు పోలీసులు లాఠీ దెబ్బలు కొడుతున్నా… మరి కొందరు పోలీసులైతే రెండు జోడించి దణ్ణం పెట్టి మరి బ్రతిమిలాడుతున్నారు. ఇంతగా చెప్పినా కూడా కొంత మందికి ఆకతాయిలు పోలీసుల మీదే తిరగబడుతున్నారు.
తాజాగా ఈ లాక్ డౌన్ పై తెలంగాణ పోలీసులు ఒక సర్వే నిర్వహించారు. అందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ప్రకారం చదువుకున్న వారికంటే చదువులేని వారు ఈ లాక్ డౌన్ ను ఎక్కువగా పాటిస్తున్నట్టు సర్వేలో తేలింది. ఈ సర్వేను తెలంగాణ పోలీసుల అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ… “మాకు అందిన సమాచారం ఆధారంగా, చేయబడ్డ చిన్న విశ్లేషణ., చిన్నబుచ్చుకోకుండా, పెద్దమనసు చేసుకుని, ఇంటి వద్దనే ఉండి, మీ బాధ్యత నిర్వర్తించండి.” అంటూ ట్వీట్ చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…